జగిత్యాల, న్యూస్లైన్ : ఖరీఫ్లో వరిధాన్యం దిగుబడిపై జగిత్యాల డివిజన్ రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటనష్టం పోను ఎంత మేరకు దిగుబడి వస్తుందని ఇటు రైతులు, అటు వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు.
మరోపక్క బుధవారం నుంచి ధాన్యం కొనుగోలుకు కేంద్రాలు సిద్ధమయ్యాయి. ఈ సంవత్సరం వర్షాలు పుష్కలంగా కురవడం, ఎస్సారెస్పీ ద్వారా సాగునీరందడంతో వరిసాగు ఆశాజనకంగా ఉందని రైతులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొంతమేర పంట దెబ్బతిన్నప్పటికీ.. ఎకరానికి సగటున 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.
దీంతో జగిత్యాల డివిజన్లో 30,64,450 క్వింటాళ్ల ధాన్యం దిగుబడిగా వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. డివిజన్ పరిధిలోని నియోజకవర్గాల వారీగా రానున్న ధాన్యం దిగుబడులపైనా అధికారులు లెక్కలు వేశారు. జగిత్యాల నియోజకవర్గం అత్యధికంగా 9,65,580 క్వింటాళ్లు, ధర్మపురి నియోజకవర్గంలో 8,76,610 క్వింటాళ్లు, కోరుట్ల నియోజకవర్గంలో 5,81,650 క్వింటాళ్లు, డివిజన్ పరిధిలోకి వచ్చే చొప్పదండి నియోజకవర్గంలోని రెండు మండలాల్లో 2,87,770, వేములవాడ నియోజకవర్గంలోని రెండు మండలాల్లో 3,52,840 క్వింటాళ్ల ధాన్యం దిగుబడిగా వస్తుందని అంచనా వేశారు. ఈ మేరకు డివిజన్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ సబ్ కలెక్టర్ శ్రీకేశ్ లట్కర్కు నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా జిల్లాలోనే అత్యధికంగా జగిత్యాల డివిజన్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల ఇక్కడికి వచ్చిన జాయింట్ కలెక్టర్ హెచ్.అరుణ్కుమార్ ప్రకటించారు. 126 ఐకేపీ కేంద్రాలు, 47 ప్రాథమిక వ్యవసాయ పరపతి కేంద్రాలను ఏర్పాటు చేయగా, 12 వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా నేటి నుంచి వరిధాన్యం కొనుగోలు చేయనున్నారు.
ఈ మేరకు కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. గత సంవత్సరం జిల్లాలో ఐకేపీ కొనుగోలు చేసిన ధాన్యంలో మూడొంతులు జగిత్యాల డివిజన్ నుంచి కొనుగోలు చేశారు. జిల్లాలో 2012 ఖరీఫ్లో 33.38 లక్షల క్వింటాళ్ల ధాన్యం రూ.378 కోట్లతో కొనుగోలు చేశారు. 2013 రబీలో 17.98 లక్షల ధాన్యాన్ని రూ.224 కోట్లతో కొనుగోలు చేశారు. ఈసారి కూడా జిల్లాలో రూ.500 కోట్ల మేర వరిధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉందని ఐకేపీ అధికారులు అంచనా వేస్తున్నారు.
దిగుబడిపైనే ఆశలు
Published Wed, Nov 6 2013 3:10 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
SRH VS LSG: లక్నోపై 10 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement