► కూలి ఇవ్వకపోవడంతో పనులకు
► వెళ్లకుండా గిరిజనుల ఆందోళన
శ్రీహరికోట(సూళ్లూరుపేట): సతీష్ ధవన్ స్పేస్సెంటర్ (షార్)లో తోటమాలి పనులు చేస్తున్న శబరి గిరిజన కాలనీకి చెందిన 200 మంది కూలీలకు సకాలంలో జీతాలు ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని సమాచారం. తోటమాలి పను లు చేసేవారికి వారానికి ఒకసారి జీతభత్యాలు ఇస్తుం టారు. ఈసారి మాత్రం షార్ అధికారులు కావాలనే వారికి జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని సీఐటీయూ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే వాస్తవానికి షార్లో ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ హార్టికల్చర్ డివిజన్ పరిధిలో తోటమాలి పను లు చేయిస్తుంటారు. దీనికి మూడేళ్లకు ఒకసారి టెం డర్లు నిర్వహించి కాంట్రాక్టర్లకు ఇస్తుంటారు. షార్లోనే పుట్టి పెరిగిన శబరి గిరిజన కాలనీలకు చెందిన కూలీలను ఏర్పాటుచేసుకుని కాంట్రాక్టర్ పనులు చేయించుకునేవారు.
అయితే కాంట్రాక్టర్లు ఇస్తున్న కూలి తక్కువగా ఉండటంతో అక్కడి యానాదులం తా కలసి ‘శ్రీహరికోట యానాది మ్యూచ్వల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ లేబర్ కాంట్రాక్టు సొసైటీ లిమిటెడ్’ ఏర్పాటు చేసుకుని శబరికాలనీలోనే హట్ నంబర్ ఏ-32లో కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకున్నారు. తోటమాలి పనులకు సంబంధించి 2015 డిసెంబర్లో జరిగిన టెండర్లలో ఈ సొసైటీ కూడా అందరితో పాటు టెండర్ వేసింది. అందరికంటే తక్కువగా రూ.54.60 లక్షలకు కోట్ చేసి వేయడంతో పనులు ఆ సొసైటీకి అప్పగించాల్సి వచ్చింది.
ఈ కాంట్రాక్టు దక్కించుకున్న సొసైటీ వారు ఈ ఏడాది జనవరి నుంచి పనులు చేస్తున్నారు. అయితే సొసైటీ తరఫున వారానికి ఎంత వస్తుందో అంత మొత్తాన్ని కూలీలందరూ సమష్టిగా తీసుకుంటూ పనులు చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో ప్రమాదమని షార్లోని ఫారెస్ట్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్కు చెందిన అధికారులు, కాంట్రాక్టర్లు యానాదులను ఎలాగైనా ఇబ్బందులకు గురిచేయాలనే దురుద్దేశంతోనే జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపణలున్నాయి.
అధికారుల ఇంటి పనివారికీ..
షార్లో చాలామంది ఉన్నతాధికారులు ఇళ్లలో పనులు చేయించుకునే వారికి కూడా తోటమాలి పనుల కింద మస్టర్రోల్ వేసి జీతాలు ఇస్తున్నారని, ప్రయోగాల సమయంలో తక్కువమందితో పనిచేయించి ఎక్కువమందికి మస్టర్రోల్ వేసి డిపార్ట్మెంట్ అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై దోచుకుని తింటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటిన్నింటికీ చెక్పెడుతూ యానాదులు సొసైటీని ప్రారంభించి ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా చేశారు. దీనిని జీర్ణించుకోలేని వారు సొసైటీని నాశనం చేసేందుకు కుట్రలు పన్ని, వారి కడుపులు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి కక్షపూరిత ధోరణిని మాని న్యాయంగా కాంట్రాక్టు పొందిన గిరిజన కూలీలకు సకాలం లో కూలి చెల్లించకపోతే ఆందోళన చేపడతామని సీఐటీయూ నాయకులు హెచ్చరిస్తున్నారు.
షార్ డెరైక్టర్కు ఫిర్యాదు
షార్లో తోటమాలి పనులు చేస్తున్న గిరిజన కూలీలకు జీతభత్యాలు ఇవ్వకుండా వేధిస్తున్న వైనాన్ని శ్రీహరికోట యానాది మ్యూచువల్ ఏయిడెడ్ కో ఆపరేటివ్ లేబర్ కాంట్రాక్టు సొసైటీ లిమిటెడ్ ప్రతినిధులు గురువారం డెరైక్టర్ కున్హికృష్ణన్ ఫిర్యాదు చేశారు. పది రోజు ల నుంచి జీతాలు ఇవ్వకపోతే తామెలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. తామంతా సమష్టిగా పనులు చేసి కష్ట పడుతుంటే ఎందుకిలా వేధిస్తున్నారో అర్థం కావడంలేదని వాపోయారు. విచారించి తమకు న్యా యం చేయాలని సొసైటీ సభ్యులు డెరైక్టర్ను కోరా రు. దీనిపై షార్ కంట్రోలర్ రాజారెడ్డిని వివరణ కోర గా ఈ నెలలో వరుసగా బ్యాంక్ సెలవులు రావడంతో కూలి ఇవ్వడం ఆలస్యమైందన్నారు. గిరిజనేతర కూలీలు వస్తే దీనిపై విచారణ చేపడతామని చెప్పారు.
కూలీల కడుపుకొడుతున్న షార్ అధికారులు!
Published Fri, Apr 22 2016 4:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement