ప్రయోగానికి సిద్ధంగా ఉన్న జీఎస్ఎల్వీ ఎఫ్–17 ఉపగ్రహ వాహకనౌక
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జూన్ 10వ తేదీన జీఎస్ఎల్వీ ఎఫ్–17 ప్రయోగాన్ని నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఈ ప్రయోగం ద్వారా 1,117 కిలోలు బరువు కలిగిన ఈవోఎస్–05 (జీఐశాట్–1ఏ) అనే భూ పరిశీలన ఉపగ్రహా న్ని నింగిలోకి పంపనున్నారు.
అయితే ఈ ప్రయోగం మార్చి నెల నుంచి వాయిదా పడుతూ వస్తోంది. వరుసగా రెండు పీఎస్ ఎల్వీ ప్రయోగాలు విఫలమైన తర్వాత చేపట్టనున్న జీఎస్ఎల్వీ ఎఫ్–17 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించాలని శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా దృష్టిసారించారు.


