ఉద్యోగుల హెల్త్‌కార్డులపై సీఎస్ సమీక్ష


హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన హెల్త్‌కార్డులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సమీక్షించారు. కొంత మంది ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలతో ఆయన సచివాలయంలో మంగళవారం భేటీ అయ్యారు. హెల్త్‌కార్డుల జాప్యానికి కారణాలు, ప్రభుత్వాసుపత్రులకు ప్యాకేజీలు ఏ విధంగా ఉన్నాయి, నగదు రహిత వైద్యానికి అర్హులు ఎంత మంది ఉన్నారు తదితర వివరాలు అడిగారు.



విజయవాడలో ఏర్పాటు చేసే తాత్కాలిక కార్యాలయాలపైనా ఉద్యోగ సంఘాలతో చర్చించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి గిరిధర్ అరమానె, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యాంబాబ్‌లు పాల్గొన్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top