సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ ఆమోద ముద్ర వేయించిన తరుణంలో జిల్లాలో ఇక ఆ పార్టీకి ఆనం సోదరులే దిక్కు కానున్నారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఎటు పోవాలో తేల్చుకోలేక ఊగిసలాటలో ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలని ఇప్పటికే రంగంలోకి దిగిన ఆశావహుల్లో సైతం ఆందోళన నెలకొంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నప్పటి నుంచే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పార్టీ మారడానికి మానసికంగా సిద్ధపడ్డారు.
వైఎస్సార్సీపీలో చోటు దక్కే పరిస్థితి లేని వారు టీడీపీ తలుపు తట్టారు. రాష్ట్ర విభజన విషయంలో సీఎం కిరణ్ తీరుకు భిన్నంగా నిలచి అధిష్టానం విధేయులుగా ముద్ర వేసుకునేందుకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి తొలి నుంచి ఆ బాటలోనే నడిచారు.
రోశయ్యను సీఎం పదవి నుంచి తొలగించే సమయంలో ఆ అవకాశం తనకు దక్కకుండా చేశారని రామనారాయణరెడ్డి అప్పటి నుంచే సీఎం కిరణ్ మీద లోలోన రగిలిపోతూ వస్తున్నారు. అందుకే ఆయన అధిష్టానం బాటే ఎంచుకున్నారు. ఇందులో భాగంగానే సీఎం కొత్త పార్టీ పెట్టినా తాము వెళ్లేది లేదని, తాము కాంగ్రెస్లోనే ఉంటామని ఎమ్మెల్యే వివేకా బహిరంగంగానే ప్రకటించారు.
ఆదివారం సీఎం సీమాంధ్ర మంత్రులు, శాసనసభ్యులతో నిర్వహించిన ఆంతరంగిక సమావేశానికి ఈ కారణంగానే రామనారాయణరెడ్డి హాజరు కాలేదనే ప్రచారం జరుగుతోంది. సీఎంకు వ్యతిరేకంగా ఉంటేనే ఇప్పుడు కాకపోయినా ఇంకొంత కాలానికైనా తమకు మరింత గుర్తింపు, ప్రాధాన్యత దక్కుతాయనే నమ్మకంతోనే ఆనం సోదరులు జై కాంగ్రెస్ నినాదంతోనే ముందుకు సాగుతున్నారు. మంగళవారం తెలంగాణ బిల్లుకు లోక్సభలో ఆమోద ముద్ర పడినా ఆనం సోదరులు ఈ విషయం గురించి మాట్లాడకుండా జాగ్రత్త పడ్డారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జిల్లాలో ముఖ్య నేతలెవరూ కాంగ్రెస్కు మిగిలే పరిస్థితి లేనందున జరగబోయే ఎన్నికల నాటికి ఆ పార్టీకి ఆనం సోదరులే దిక్కు కానున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు అడిగే వారు కూడా కనిపించని పరిస్థితుల్లో జిల్లాలోని అన్ని శాసనసభ స్థానాలకు, పార్లమెంటు స్థానానికి తాము లేదా తమ కుటుంబ సభ్యులనో, ఇతరులనో పోటీ చేయించే బాధ్యత కూడా వీరే భుజానికెత్తుకోనున్నారు.
తాజా పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి సైతం కాంగ్రెస్లోనే కొనసాగాలా? సీఎం పార్టీ పెడితే అటు వెళ్లాలా? లేక మరేదారైనా చూసుకోవాలా? అనే విషయంలో అనేక ఆలోచనలు చేస్తున్నారు. వాకాటి పదవీ కాలం ముగిసే నాటికి పరిస్థితులన్నీ సద్దుమణిగే అవకాశం ఉన్నందున తొందరపడి నిర్ణయం తీసుకోరాదని ఆయన శ్రేయోభిలాషులు సూచిస్తున్నారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం జిల్లాలో కాంగ్రెస్కు భారీ నష్టం చేకూర్చిందని చెప్పవచ్చు.
మిగిలింది ఇద్దరే
Published Wed, Feb 19 2014 3:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హైదరాబాద్లో భారీగా భూమిని కొన్న మైక్రోసాఫ్ట్!
మరో మహిళతో రొమాన్స్.. చాలా ఎగ్జైట్ అయ్యానన్న సోనాక్షి
‘రైతుల భూ డాక్యుమెంట్లను బుగ్గిపాలు చేసింది బాబేగా!’
ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్
తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వరంగల్ను BRS, కాంగ్రెస్ బారి నుంచి కాపాడాలి: ప్రధాని మోదీ
కొవిషీల్డ్ వ్యాక్సిన్ను రద్దు చేసిన ఆస్ట్రాజెనెకా.. కారణం తెలుసా..
పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు
పవన్ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు?: పోసాని
తప్పక చదవండి
- ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
- ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఓటేయవచ్చు!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
Advertisement