'నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు' | Sakshi
Sakshi News home page

'నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు'

Published Mon, Apr 13 2015 1:18 PM

chevireddy visits mpdo office in tirupati

తిరుపతి రూరల్: ప్రజావిజ్ఞప్తుల దినం సందర్భంగా సోమవారం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తిరుపతి రూరల్ ఎమ్‌పీడీవో కార్యాలయాన్నిఆకస్మికంగా సందర్శించారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో వ్యయప్రయాసలకోర్చి ప్రజలు కార్యాలయానికి వస్తే అధికారులు గైర్హాజరు కావడంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. విధి నిర్వాహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement