ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సింగపూర్కు వెళ్లనున్నారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సింగపూర్కు వెళ్లనున్నారు. గురువారం జరిగే సింగపూర్ మాజీ ప్రధాని లీ క్వాన్ యీ అంత్యక్రియలకు ఆయన హాజరవుతారు. అనంతరం గురువారం రాత్రికి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
సీఎం వెంట రాష్ట్ర ప్రభుత్వ సమాచార సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి సతీష్చంద్ర కూడా సింగపూర్కు వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే ఈనెల 29 నుంచి 31 వరకూ జరగాల్సిన చంద్రబాబు బృందం సింగపూర్ పర్యటన యీ మృతి కారణంగా వాయిదా పడింది.