మదనపల్లెలో చైన్‌స్నాచింగ్ | chain snatching in madanpalle | Sakshi
Sakshi News home page

మదనపల్లెలో చైన్‌స్నాచింగ్

Dec 15 2015 11:26 AM | Updated on Sep 3 2017 2:03 PM

చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని ఎస్‌బీఐ కాలనీలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు.

మదనపల్లె : చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని ఎస్‌బీఐ కాలనీలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. మంగళవారం ఉదయం రోడ్డుపై వెళ్తున్న మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లారు. వివరాలు... ఎస్‌బీఐ కాలనీకి చెందిన కవిత(25) ఉదయం దుకాణం తెరిచేందుకు ఇంటి నుంచి వెళుతుండగా పల్సర్ బైక్‌లో వచ్చిన ఇద్దరు యువకులు ఆమెను అడ్డగించి మెడలోఉన్న 30 గ్రాముల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement