ఆ రాయి ఎక్కడిదో కిరణ్ చెప్పాలి: బొత్స | Botsa Satyanarayana satires on former CM Kiran Kumar Reddy | Sakshi
Sakshi News home page

ఆ రాయి ఎక్కడిదో కిరణ్ చెప్పాలి: బొత్స

Mar 10 2014 10:51 PM | Updated on Jul 29 2019 5:31 PM

ఆ రాయి ఎక్కడిదో కిరణ్ చెప్పాలి: బొత్స - Sakshi

ఆ రాయి ఎక్కడిదో కిరణ్ చెప్పాలి: బొత్స

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీపై పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీపై పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కిరణ్ పార్టీ ఊహించేదేనని బొత్స అన్నారు. కిరణ్ పార్టీపై కొత్తగా స్పందించేదేమిలేదని బొత్స అన్నారు. 
 
జై సమైక్యాంధ్ర పార్టీ పేరు ప్రకటన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కిరణ్ చూపించిన రాయి ఎక్కడిదో చెప్పాలని అన్నారు. ఆ రాయి బెర్లిన్ గోడదా లేక ఇక్కడిదే తీసుకువచ్చి చూపిస్తున్నారా అని ఎద్దేవా చేశారు. 
 
జై సమైక్యాంధ్ర పార్టీ ప్రకటన సందర్భంగా మాజీ సీఎం కిరణ్ మాట్లాడుతూ.. బెర్లిన్ గోడ పగలు కొట్టి ఐక్యమైన విషయాన్ని ప్రస్తావించారు. సమైక్య రాష్ట్ర ఏర్పాటు దిశగా పోరాటం చేస్తామని కిరణ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement