నెల్లూరులో బ్లాక్‌మనీ కలకలం | Black Money in Nellore | Sakshi
Sakshi News home page

నెల్లూరులో బ్లాక్‌మనీ కలకలం

Dec 16 2016 1:37 AM | Updated on Apr 3 2019 5:16 PM

నెల్లూరు నగరంలో గురువారం బ్లాక్‌మనీ కలకలం రేగింది. నగరంలోని ఓ హోటల్‌లో రూ.కోట్లలో నోట్ల మార్పిడి జరుగుతోందని అందిన సమాచారంతో జిల్లా పోలీసులు ఓ హోటల్‌పై దాడిచేశారు.

పోలీసుల అదుపులో హైదరాబాద్‌కు చెందిన నలుగురు రియల్టర్లు
నెల్లూరు(క్రైమ్‌): నెల్లూరు నగరంలో గురువారం బ్లాక్‌మనీ కలకలం రేగింది. నగరంలోని ఓ హోటల్‌లో రూ.కోట్లలో నోట్ల మార్పిడి జరుగుతోందని అందిన సమాచారంతో జిల్లా పోలీసులు ఓ హోటల్‌పై దాడిచేశారు. సుమారు గంటపాటు గదిలో క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించారు. కానీ అక్కడ ఏమి దొరకకపోవడంతో గదిలో ఉన్న నలుగురు రియల్టర్ల(హైదరాబాద్‌)ను అదుపులోకి తీసుకొన్నారు. నెల్లూరు నగరానికి చెందిన ఓ వ్యక్తికి హైదరాబాద్‌లో రూ.కోట్లు విలువ చేసే ఏడెకరాల భూమి ఉంది. దానిని హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు రియల్టర్లు 4 నెలల కిందట కొంత నగదు అప్పచెప్పి భూమి యజమాని వద్ద అగ్రిమెంట్‌ చేసుకొన్నారు.  జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ(జీపీఏ) చేసుకొనేందుకు వారు గురువారం నెల్లూరుకు వచ్చి దర్గామిట్టలోని మినర్వా హోటల్‌లో దిగారు. ఈ క్రమంలో హోటల్‌లో రూ.కోట్లలో  నగదు మార్పిడి జరుగుతోందంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సాయంత్రం హోటల్‌పై దాడి చేశారు. దీంతో నలుగురు రియల్టర్‌లను అదుపులోకి తీసుకొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement