ఒకేచోట ఐదేళ్లుంటే ట్రాన్స్ఫర్ తప్పదు | ap government releases guidelines in employees transfers issue | Sakshi
Sakshi News home page

ఒకేచోట ఐదేళ్లుంటే ట్రాన్స్ఫర్ తప్పదు

May 18 2015 10:02 PM | Updated on Aug 18 2018 8:05 PM

ఒకేచోట ఐదేళ్లుంటే ట్రాన్స్ఫర్ తప్పదు - Sakshi

ఒకేచోట ఐదేళ్లుంటే ట్రాన్స్ఫర్ తప్పదు

ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను ఎట్టకేలకు ప్రభుత్వం విడుదలచేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఐదేళ్లు ఒకేచోట పనిచేసినవారికి బదిలీ తప్పనిసరి.

హైదరాబాద్: ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు విడుదలచేసింది. మంగళవారం నుంచి బదీలల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో సోమవారం రాత్రి హడావిడిగా సంబంధిత జీవో నంబర్ 57ను విడుదల చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఐదేళ్లు ఒకేచోట పనిచేసినవారికి బదిలీ తప్పనిసరి.

కనీసం రెండేళ్లు ఒకేచోట పనిచేసినవారు బదిలీ ప్రక్రియలో పాల్గొనేందుకు అర్హులని ప్రభుత్వం పేర్కొంది. రెండేళ్లలో రిటైర్ కానున్నవారిని బదిలీ చెయ్యొద్దని అదేశాలు జారీచేసింది, కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించే ఈ ప్రక్రియను మే 31లోగా పూర్తిచేయాలని సూచించింది. బదిలీల ప్రక్రియను ఇన్చార్జి మంత్రులు పర్యవేక్షిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement