రేవంత్‌ రెడ్డి విచారణపై ఏపీ ప్రభుత్వం ఆరా! | AP Government Inquiry On Revanth Reddy investigation Over Cash For Vote Case | Sakshi
Sakshi News home page

రేవంత్‌ రెడ్డి విచారణపై ఏపీ ప్రభుత్వం ఆరా!

Oct 3 2018 5:19 PM | Updated on Oct 3 2018 5:22 PM

AP Government Inquiry On Revanth Reddy investigation Over Cash For Vote Case - Sakshi

సాక్షి, అమరావతి : ‘ఓటుకు కోట్లు కేసు’  లో ఏ1 నిందితుడు, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డిని ఆదాయపు పన్ను శాఖ అధికారుల బుధవారం విచారించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారన దాదాపు ఐదు గంటల పాటు కొనసాగింది. ఈ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా సంబంధం ఉన్న విషయం తెలిసిందే. దీంతో రేవంత్‌ విచారణ పరిణామాలపై ఏపీ ప్రభుత్వం ఆరా తీసుస్తోంది. ఐటీ కార్యాలయ పరిసరాల్లో ఏపీ ఇంటలిజెన్స్‌, ఎస్‌బీ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఐటీ సోదాలు, విచారణను గమనిస్తున్న ఏపీ ప్రభుత్వ పెద్దలు భయాందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement