లక్ష్మీపార్వతికి కీలక పదవి

AP Government Appointed Nandamuri Laxmi Parvathi as the Chairperson of Telugu Academy - Sakshi

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతికి కీలక పదవి దక్కింది. ఆమెను తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్‌ బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. లక్ష్మీ పార్వతి తెలుగు విశ్వవిద్యాలయంలో పీజీ చేశారు. 2000 సంవత్సరంలో ఆమె తెలుగు సాహిత్యంలో ఎమ్‌. ఎ పూర్తి చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top