10 నుంచి ఏపీ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ | AP Edcet counselling from july 10 | Sakshi
Sakshi News home page

10 నుంచి ఏపీ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్

Jul 8 2015 12:55 AM | Updated on Aug 18 2018 7:58 PM

బీఈడీ కళాశాలల్లో ప్రవేశానికి ఏపీ ఎడ్‌సెట్-2015 వెబ్ కౌన్సెలింగ్‌ను 10 నుంచి నిర్వహించనున్నట్టు ఎడ్‌సెట్ కన్వీనర్ టి.కుమారస్వామి మంగళవారం తెలిపారు.

తిరుపతి: బీఈడీ కళాశాలల్లో ప్రవేశానికి ఏపీ ఎడ్‌సెట్-2015 వెబ్ కౌన్సెలింగ్‌ను 10 నుంచి నిర్వహించనున్నట్టు ఎడ్‌సెట్ కన్వీనర్ టి.కుమారస్వామి మంగళవారం తెలిపారు. ఎస్‌కేయూ(అనంతపురం), ఎస్వీయూ(తిరుపతి), జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల(కాకినాడ), ఏఎన్‌యూ(గుంటూరు), అంబేద్కర్ యూనివర్సిటీ(శ్రీకాకుళం), ఏయూ ఇంజినీరింగ్ కళాశాల(విశాఖపట్నం)లో హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన కోసం విద్యార్థులు సెంటర్లలో హాజరవ్వాలని ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement