గవర్నర్తో భేటీ కానున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో సోమవారం భేటీ కానున్నారు. ఈరోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు ఆయనను మర్యాదపూర్వకంగా కలువనున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా కరోనా వైరస్ నేపథ్యంలో శాసనసభ, మండలి బడ్జెట్ సమావేశాలలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రసంగించిన విషయం తెలిసిందే. (చదవండి: ప్రగతి పథంలో పరుగులు)