ఓట్లకోసం రాష్ట్ర విభజన తగదు: దేవెగౌడ | andhra pradesh should be united, says deve gowda | Sakshi
Sakshi News home page

ఓట్లకోసం రాష్ట్ర విభజన తగదు: దేవెగౌడ

Nov 29 2013 3:11 AM | Updated on Sep 2 2017 1:04 AM

ఓట్లకోసం రాష్ట్ర విభజన తగదు: దేవెగౌడ

ఓట్లకోసం రాష్ట్ర విభజన తగదు: దేవెగౌడ

ఓట్లకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలని చూడడం సరికాదని మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ అభిప్రాయపడ్డారు. గురువారం రాత్రి ఆయన తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

సాక్షి, తిరుమల : ఓట్లకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలని చూడడం సరికాదని మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ అభిప్రాయపడ్డారు. గురువారం రాత్రి ఆయన తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దేశంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడ్డాయన్నారు. ఆంధ్రరాష్ట్రం కోసం పొట్టిశ్రీరాములు తన ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను ఏ ప్రాతిపదికన విభజిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement