'మోడీని విమర్శిస్తే ఇబ్బందులే' | Sakshi
Sakshi News home page

'మోడీని విమర్శిస్తే ఇబ్బందులే'

Published Sun, Aug 10 2014 11:36 AM

'మోడీని విమర్శిస్తే  ఇబ్బందులే' - Sakshi

విజయవాడ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబులను విమర్శించడమే తెలంగాణ సీఎం కేసీఆర్ పనిగా పెట్టుకున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు రావెల కిషోర్బాబు, కామినేని శ్రీనివాస్లు ఆరోపించారు. మోడీ, బాబును విమర్శించే అర్హత కేసీఆర్కు లేదని వారు స్పష్టం చేశారు. ఆదివారం విజయవాడలో వారు మాట్లాడుతూ... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిపై వారు మండిపడ్డారు. ప్రధాని మోడీపై విమర్శులు చేస్తే తెలంగాణ ప్రాంతంవారు ఇబ్బందులు పడతారని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన సారథ్యంలోని మంత్రులంతా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధిని కోరుకుంటున్నామని వారు స్ఫష్టం చేశారు.

Advertisement
Advertisement