ధోనీకి అనంత కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ

ధోనీకి అనంత కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ - Sakshi


అనంతపురం : భారత క్రికెట్ కెప్టెన్ ధోనీకి అనంతపురం కోర్టు మంగళవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. బిజినెస్ టుడే మేగజైన్ ముఖచిత్రంపై విష్ణుమూర్తి అవతారంలో ఉన్న ధోనీ చిత్రాన్ని ముద్రించి, చేతిలో బూటు ఉంచడంపై విశ్వహిందూపరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు యర్రగుంట్ల శ్యాంసుందర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిబ్రవరిలో కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.



హిందువుల మనోభావాలను కించపరిచేలా ఫొటో ముద్రించినందున ధోనీ, చైతన్య కల్బగ్‌లపై చర్యలు తీసుకోవాలంటూ కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన ఎస్‌సి అండ్ యస్‌టి కోర్టు విచారణకు హాజరు కావాలని మూడుసార్లు ధోనీకి సమన్లు పంపినా హాజరు కాకపోవటంతో మంగళవారం న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.





 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top