నెల్లూరు జిల్లా పెల్లకూరు మండలంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్ననాలుగు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు.
నెల్లూరు: నెల్లూరు జిల్లా పెల్లకూరు మండలంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్ననాలుగు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. మండల కేంద్రం సమీపంలోని స్వర్ణముఖి నది నుంచి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తుండగా పోలీసులు దాడులు చేసి ట్రాక్టర్లను సీజ్ చేశారు. అనంతరం ట్రాక్టర్ల యాజమానులపై కేసులు నమోదు చేశారు.
(పెల్లకూరు)