276 మంది ఎమ్మెల్యేలకు ఓటు హక్కు | 276 MLAs have right to vote | Sakshi
Sakshi News home page

276 మంది ఎమ్మెల్యేలకు ఓటు హక్కు

Feb 6 2014 2:38 PM | Updated on Sep 2 2017 3:24 AM

భన్వర్‌లాల్‌

భన్వర్‌లాల్‌

రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొనేందుకు మన రాష్ట్రం నుంచి 276 మంది ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉందని ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ చెప్పారు.

హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొనేందుకు మన రాష్ట్రం నుంచి 276 మంది ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉందని ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రధాన అధికారి  భన్వర్‌లాల్‌ చెప్పారు.  రేపు నిర్వహించే రాజ్యసభ ఎన్నికల ఏర్పాట్లను ఆయన ఈరోజు సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశానికి డిజిపి బి.ప్రసాదరావుతోపాటు ఇతర  ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ప్రతి ఎమ్మెల్యే  పోలింగ్‌ ఏజెంట్‌కు చూపించే ఓటు వేయాల్సి ఉంటుందని భన్వర్ లాల్ చెప్పారు. పోలింగ్‌ ఏజెంట్‌, పార్టీ ఓటు రహస్యాన్ని కాపాడాల్సి ఉంటుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement