విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతి | 2 farmers died with current shoke in nellore distirict | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతి

Feb 6 2015 7:37 PM | Updated on Oct 20 2018 6:04 PM

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో శుక్రవారం సాయంత్రం కరెంట్‌షాక్‌తో ఇద్దరు రైతులు దుర్మరణం పాలయ్యారు

నెల్లూరు: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో ఘోరం జరిగింది. శుక్రవారం సాయంత్రం కరెంట్‌షాక్‌తో ఇద్దరు రైతులు దుర్మరణం పాలయ్యారు. వివరాలు...మండలంలోని చుంచులూరుకు చెందిన చీలప్రోలు పీసయ్య(55), కత్తి శీనయ్య(45) మిరప చేనులోని మోటారుకు కరెంటు కనెక్షన్ ఇచ్చేందుకు తీగను లాగారు. అంతలో తీగ పక్కనే ఉన్న ముళ్ల కంచెకు పట్టుకోవటంతో తీగపైనున్న కేబుల్ తెగిపోయింది. అది గమనించని పీసయ్య కరెంటు వైరును పట్టుకోవటంతో షాక్ తగిలి, అక్కడికక్కడే మృతి చెందాడు.

  కాగా పక్కనే ఉన్న శీనయ్య తన వద్ద ఉన్న కండువాతో  పీసయ్యను రక్షించేందుకు ప్రయత్నించగా తీవ్ర గాయాలపాలయ్యాడు. గమనించిన స్తానికులు ఆస్పత్రికి తరలిస్తుండగానే శీనయ్య మృతి చెందాడు. కాగా, పీసయ్యకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(మర్రిపాడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement