పోలీసులకు కొత్త వాహనాలు | పోలీసులకు కొత్త వాహనాలు | Sakshi
Sakshi News home page

పోలీసులకు కొత్త వాహనాలు

Jan 27 2015 2:39 AM | Updated on Aug 21 2018 5:46 PM

పోలీసులకు కొత్త వాహనాలు - Sakshi

పోలీసులకు కొత్త వాహనాలు

చిత్తూరు జిల్లా పోలీసుశాఖకు ప్రభుత్వం పలు కొత్త వాహనాలను కేటాయించింది.

చిత్తూరు (అర్బన్):  చిత్తూరు జిల్లా పోలీసుశాఖకు ప్రభుత్వం పలు కొత్త వాహనాలను కేటాయించింది. గణతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వాహనాలకు పూజలు చేసి అధికారులకు కేటాయిస్తూ ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు.

ఈ వాహనాల్లో ఫోర్డ్ ఎకో-3, స్కార్పియో-1, మినీ బస్సు-1, జీపు-1, బొలేరో-1, మోటారు సైకిళ్లు 10 ఉన్నాయి. ఈ పూజా కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ రమణయ్య, ఆర్‌ఎస్‌ఐ సురేష్ పాల్గొన్నారు. అలాగే శిక్షణ పూర్తి చేసుకున్న రెండు స్నిపర్, ఒక ట్రాకర్ కుక్కలను సైతం ఎస్పీ పరిశీలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement