Raju Gani Saval Movie
-
ఒకే ఓటీటీలోకి వచ్చిన మూడు తెలుగు సినిమాలు
ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలు వచ్చాయి. వాటిలో లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి', తరుణ్ భాస్కర్ 'గాయపడ్డ సింహం' లాంటి స్ట్రెయిట్ చిత్రాలతో పాటు సిస్టమ్, మధువిధు, టీఎన్ 2026 తదితర డబ్బింగ్ మూవీస్తోపాటు 'మేం కాప్లం' అనే తెలుగు సిరీస్ కూడా స్ట్రీమింగ్లోకి వచ్చింది. వీటితో పాటు మరో మూడు తెలుగు సినిమా ఎలాంటి హడావుడి లేకుండా ఒకే ఓటీటీలోకి వచ్చేశాయి. ఇంతకీ అవేంటి? ఎందులో ఉన్నాయి?(ఇదీ చదవండి: సీఎం విజయ్ని టార్గెట్ చేసి తీసిన సినిమా.. ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్)గతేడాది జూలై 5న థియేటర్లలో రిలీజైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా '14'. లక్ష్మీ శ్రీనివాస్ దర్శకుడు కాగా నోయల్ సీన్, రామ్ రతన్, విశాఖ ధీమాన్ ప్రధాన పాత్రలు చేశారు. ఇప్పుడిది ఆహా ఓటీటీలోకి వచ్చింది. ముఖ్యమంత్రి కొడుకు రతన్, జూనియర్ డాక్టర్ నేహా ప్రేమలో ఉంటారు. ఓ రోజు నేహా ఫ్లాట్లో ఇద్దరూ శవాలై కనిపిస్తారు. ఆత్మహత్య అని పోలీసులు తేలిస్తే.. సుబ్బు అనే జర్నలిస్ట్, తన మిత్రులతో కలిసి ఇది హత్య అని దర్యాప్తు చేస్తాడు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.గతేడాది జూలై 19న థియేటర్లలోకి వచ్చిన 'రాజు గాని సవాల్' కూడా ఆహా ఓటీటీలోకి వచ్చింది. హైదరాబాద్ నేపథ్యంగా సాగే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఇది. లెలిజాల రవీందర్ దర్శకత్వం వహించడంతో పాటు హీరోగానూ నటించాడు. చిన్న మొబైల్ రిపేర్ షాపు నడుపుకొనే రాజు అనే వ్యక్తి.. స్నేహితులతో కలిసి తన బస్తీలో గణేష్ ఉత్సవాలు చేయాలనుకుంటాడు. కానీ ఆ ఉత్సవాల వల్ల స్థానిక నాయకుడితో రాజుకు విభేదాలు వస్తాయి. ఈ క్రమంలోనే రాజు తన కుటుంబాన్ని, బస్తీని ఎలా కాపాడుకున్నాడనేదే మిగతా స్టోరీ.గతేడాది సెప్టెంబరు 5న థియేటర్లలోకి వచ్చిన తెలుగు హారర్ కామెడీ సినిమా 'లవ్ యూ రా'. చిన్ను, గీతికా రతన్ జంటగా నటించారు. ఇందులో ప్రధానంగా స్నేహితుల మధ్య జరిగే పందెం, దాని చుట్టూ తిరిగే హారర్, నవ్వులు పుట్టించే అంశాలే ఈ మూవీ స్టోరీ. ఇది కూడా ఆహా ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ) -
‘రాజు గాని సవాల్’ కోసం ఎదురు చూస్తున్నా : డింపుల్ హయతి
లెలిజాల రవీందర్, రితికా చక్రవర్తి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా ‘రాజు గాని సవాల్’. ఈ చిత్రాన్ని లెలిజాల కమల ప్రజాపతి సమర్పణలో, ఎల్ ఆర్ ప్రొడక్షన్ బ్యానర్ పై లెలిజాల రవీందర్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఆగస్టు 8న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ని హీరోయిన్స్ డింపుల్ హయతి, రాశీ సింగ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్ డింపుల్ హయతి మాట్లాడుతూ - "రాజు గాని సవాల్" మూవీ ట్రైలర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. నేను కెరీర్ ప్రారంభించిన కొత్తలో కలిసిన సినిమా మీద ప్రేమ ఉన్న ముగ్గురు వ్యక్తులు బాపిరాజు గారు, సునీల్ కుమార్ రెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు. ఈ అమ్మాయి బాగుంటుందని నాకు మొదటి సినిమా అవకాశం ఇచ్చారు ఈ ముగ్గురు. "రాజు గాని సవాల్" మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు మీరు వస్తారా అని బాపిరాజు గారు అడిగినప్పుడు తప్పకుండా వస్తా సార్ అని చెప్పాను. బాపిరాజు గారు సినిమాను సినిమాను రూపొందించడమే కాదు ప్రేక్షకుల దగ్గరకు రీచ్ అయ్యేలా చేస్తారు. "రాజు గాని సవాల్" సినిమా సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఈ మూవీ రిలీజ్ కోసం నేనూ ఎదురుచూస్తున్నా. అన్నారు.హీరోయిన్ రాశీ సింగ్ మాట్లాడుతూ.. ‘ఈ ఈవెంట్ కు వచ్చే ముందే "రాజు గాని సవాల్" సినిమా ట్రైలర్ చూశాను చాలా బాగుంది. ఇదొక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా మూవీ. హీరో రవీందర్ గారితో పాటు రితిక, సంధ్య బాగా నటించారు. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తున్న సందర్భంగా టీమ్ అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నా. బాపిరాజు గారి నమ్మకాన్ని ఈ మూవీ నిలబెట్టాలి. "రాజు గాని సవాల్" సినిమా ఘన విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నా’ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు భారత్ భూషణ్, ప్రొడ్యూసర్స్ దామోదర ప్రసాద్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రసన్నకుమార్, గీత రచయిత గోరటి వెంకన్న, నటుడు డా.భద్రం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.


