Mobile app developers
-
యాప్ద్బాంధవులు
సమస్యను అందరూ గుర్తిస్తారు. కానీ, దాని పరిష్కార మార్గాలను కొందరే కనుగొంటారు. వారు మార్గదర్శకులుగా నిలుస్తారు. ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం, దాడులతో గాజా విధ్వంసమైంది. ఆ ప్రాంతమంతా సంక్షోభంలో నిండిపోయింది. ఆ సంక్షోభంలోనూ కొత్త దారులేస్తూ ఆశలు చిగురింపజేస్తున్నారు అక్కడి యువత. సాంకేతికతతో తమ దేశ పునర్నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారు. అవకాశాలు కోల్పోయినందుకు నిరాశతో ఊసురోమని కూర్చోకుండా తామే కొంతమందికి అవకాశం కల్పిస్తున్నారు. గాజా నగరంలోని ‘తాకత్’వర్క్ స్పేస్లో ఓ మూలన లాప్టాప్తో కూర్చుని సీరియస్గా పనిచేసుకుంటోంది 23 ఏళ్ల సజా అల్ ఘాల్. ఆమె మరో దేశంలోని కంపెనీ కోసం పనిచేయడంలేదు. పాలస్తీనా ప్రజల ఎదుర్కొంటున్న కష్టాలను పరిష్కరించడానికి పనిచేస్తోంది. తన సొంత మొబైల్ యాప్ను డెవలప్ చేస్తోంది. ఆమె డెవలప్ చేస్తున్న యాప్ పేరు ‘వాసెల్నీ’(డబ్ల్యూఏఎస్ఈఎల్ఎన్ఐ). అంటే అరబిక్లో ‘నా గమ్యాన్ని చేరడంలో నాకు సహాయం చేయండి’అని అర్థం. యుద్ధం తరువాత పాలస్తీనాలో పెరిగిన రవాణా ఖర్చులను తగ్గించడానికి రూపొందించిన రవాణా యాప్. ఈ యాప్ వల్ల ప్రయాణాలను ఒకరితో ఒకరు పంచుకోవచ్చు. ఉదాహరణకు, ఉదయం 8 గంటలకు అల్–షిఫా నుంచి మధ్య గాజా నగరంలోని అస్–సరయాకు ఎవరైనా ఒక ప్రయాణాన్ని ప్రతిపాదించవచ్చు. ఆ తర్వాత అటుగా వెళ్లాల్సి ఉన్న ఇతర వ్యక్తులు కూడా అదే ప్రయాణంలో చేరే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఖర్చును పంచుకోవచ్చు. జస్ట్ లైక్ క్యాబ్ షేరింగ్ అన్నమాట. తప్పిపోయిన వస్తువులు... సజా తరహాలోనే యుద్ధ సమయంలో సర్వసాధారణమైన మరో సమస్యపై దృష్టి పెట్టారు 26 ఏళ్ల ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ గ్రాడ్యుయేట్ బహా అల్మల్లాహి. యుద్ధ సమయంలో ప్రజలు సర్వం కోల్పోయారు. వ్యక్తిగత వస్తువులు, అధికారిక పత్రాలు, ఫోన్లు, బ్యాగులు.. మరెన్నో. వాటి ఖరీదు ఎక్కువేం కాకపోవచ్చు. కానీ, వాటి విలువ ఎక్కువ. జీవితంలో ఎంత ప్రాముఖ్యత ఉన్న వస్తువులై ఉంటాయి. అలా పోగొట్టుకున్న వస్తువుల గురించి సోషల్ మీడియా వేదికల్లో విజ్ఞప్తులు వెల్లువెత్తుతుండటం బహా గమనించారు. పోగొట్టుకున్న, లేదా దొరికిన వస్తువుల కోసం ఒక ప్రత్యేక డిజిటల్ వేదికను సృష్టించాలనే ఆలోచన అతనికి వచి్చంది. అలా డెవలప్ అయ్యిందే ‘రజ్జా’లి’. అంటే అరబిక్లో ‘నాకు తిరిగివ్వండి’అని అర్థం. ‘మీకు ఏదైనా దొరికినా లేదా మీరేమైనా పోగొట్టుకున్నా.. దానికోసం ఇక్కడ వెతకండి’అని అన్నాడు. అయితే, ఈ ప్రాజెక్ట్ అక్కడితో ఆగలేదు. యుద్ధం నిరాశ్రయులను చేస్తుండటంతో గాజాలో వలసలు రోజురోజుకు పెరిగాయి. ఈ క్రమంలో కిక్కిరిసిన జనాల మధ్య తమ ఆతీ్మయులను కోల్పోతున్నారు. అలా తప్పిపోయిన పిల్లల కేసులను కూడా చేర్చడానికి భవిష్యత్తులో ఈ ప్లాట్ఫారమ్ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు. ఒక నిర్దిష్ట ప్రాంతంలో పిల్లలు తప్పిపోతే, వెంటనే వారి ఫొటో వివరాలతో వెంటనే సమీప ప్రాంతాల ప్రజలకు తక్షణం తెలపడానికి ఈ యాప్ రూపొందించారు. అనేక అడ్డంకులు.. అయితే, యాప్ను రూపొందించడంతో సగం పని మాత్రమే పూర్తయ్యింది. వాటిని జనంలోకి విస్తతంగా తీసుకెళ్లడం అసలైన టాస్్క. ఉదాహరణకు, సజా రూపొందించిన వాసెల్నీ యాప్ను ఒక వ్యక్తి తెరిచి, అదే సమయంలో అదే మార్గంలో ప్రయాణించడానికి తక్కువ మంది ఉండటమో, అసలు లేకపోవడమో జరిగితే.. అతను ఆ యాప్పై విముఖత చూపే అవకాశం ఉంది. అందుకే దీన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి, డ్రైవర్లను ధృవీకరించడానికి స్థానిక అధికారుల ఆమోదం అవసరమని సజా అంగీకరిస్తున్నారు. పోగొట్టుకున్న పత్రాలను కనుగొనడానికి తన ప్లాట్ఫామ్ను విశ్వసించాలంటే అధికారిక సంస్థల సహకారం అవసరమని బహా చెబుతున్నారు. ఇదంతా వారికి ఆర్థిక భారంగా మారింది. ఎందుకంటే, కొత్త ప్రాజెక్టులు ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలపై ఆధారపడుతున్నాయి. వీటి కొనుగోలు చాలా ఖరీదైన పని. శిక్షణా కేంద్రంగా.. అయితే కేవలం పనిచేసుకోవడానికి కొన్ని సదుపాయాలు, స్థలం మాత్రమే కల్పిస్తే సరిపోదని తొందర్లోనే అర్థమైంది. గాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచ టెక్ ప్రపంచం నుంచి యుద్ధం వేరు చేసింది. రెండేళ్లలో టెక్ ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతుండగా, గాజాలోని యువత ప్రాణాలు కాపాడుకోవడానికి కష్టపడాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగవంతమైన విజృంభణతో.. గాజాలో ప్రోగ్రామర్లు ప్రపంచ మార్కెట్ డిమాండ్లను అందుకోవడంలో వెనుకబడ్డారు. ఈ అంతరాన్ని పూడ్చే శిక్షణా కార్యక్రమాలపై దృష్టి పెట్టడం ప్రారంభించింది. ఫలితంగా, విశ్వవిద్యాలయాలు, స్థానిక, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యంతో ‘తాకత్’ఒక కార్యక్షేత్రం నుంచి శిక్షణనిచ్చే ఇంక్యుబేషన్ కేంద్రంగా రూపాంతరం చెందింది. వీరి నుంచే కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. తమ ప్రత్యక్షంగా ఎదుర్కొనే సమస్యల అనుభవాల నుంచే ఈ పరిష్కార మార్గాలు కనిపెట్టారు విద్యార్థులు. అయినప్పటికీ, ఈ ప్రాజెక్టులకు మోక్షం కలగాలంటే పెట్టుబడి అవసరం. డెవలపర్లు ప్రధాన ఆర్థిక, సాంకేతిక అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. వారి ప్రతిభను ఆచరణలోకి తీసుకురావడానికి పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యోగులకు ‘తాకత్’... యుద్ధం ప్రారంభమైన తర్వాత చాలా మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఆ తరువాత అవకాశాల కోసం ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇక, ఉన్నా.. విద్యుత్ అందుబాటులో లేకపోవడం, ఇంటర్నెట్ అంతరాయాలతో ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. అవి విలాస వస్తువులుగా మారిపోయాయి. కేవలం విద్యుత్, ఇంటర్నెట్ ఉన్న చోటుకోసం నెలకు రెండొందల షెకెల్స్.. అంటే దాదాపు ఏడువేలు. అలాంటి వారికోసమే కో వర్కింగ్స్పేస్ స్థాపించారు సీఈఓ, ఇంజనీర్ అయిన షరీఫ్ నయీమ్. దాని పేరు ‘తాకత్’. ‘యుద్ధం ప్రారంభంలో మౌలిక సదుపాయాలు ధ్వంసవ్వడంతో చాలాకాలం పాటు కమ్యూనికేషన్లు, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వేలాది మంది ఫ్రీలాన్సర్లు, ప్రోగ్రామర్లు పనిచేసే అవకాశం కోల్పయారు. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొందరు అంతర్జాతీయ కాంట్రాక్టులను పోగొట్టుకున్నారు. పవర్ లేక కొందరు ఆన్లైన్ సమావేశాలకు హాజరు కాలేకపోయారు. వారందరికీ పనిచేసుకునే అవకాశం కల్పించాలనే లక్ష్యంతో గాజాలో ‘తకాత్’స్థాపించాను’అని నయీమ్ చెబుతున్నారు. యుద్ధ సమయంలో గాజా నగరంలో ఏర్పాటైన ఇది క్రమంగా నుసైరత్, డెయిర్ అల్–బలాహ్ సహా అనేక ప్రాంతాలకు విస్తరించింది. గాజా నగరంలో తన ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించి, సుమారు 250 మంది ఫ్రీలాన్సర్లు, ప్రోగ్రామర్లకు వసతి కల్పించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
యాప్ స్టోర్.. ఏడాదిలో రూ.44 వేల కోట్ల విక్రయాలు
టెక్ దిగ్గజం యాపిల్ యాప్ స్టోర్ ద్వారా గతేడాది రూ.44,447 కోట్ల విలువ చేసే డెవలపర్ల బిల్లింగులు, విక్రయాలు (ఉత్పత్తులు, సేవలు) నమోదయ్యాయి. యాపిల్కి కమీషన్లులాంటివి లేకుండా ఇందులో 94 శాతం భాగం నేరుగా డెవలపర్లు, వ్యాపార సంస్థలకే లభించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (అహ్మదాబాద్)కి చెందిన ప్రొఫెసర్ విశ్వనాథ్ పింగళి నిర్వహించిన అధ్యయన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.నివేదికలోని అంశాల ప్రకారం గత అయిదేళ్లలో భారతీయ డెవలపర్లకు అంతర్జాతీయంగా వచ్చే ఆదాయాలు రెట్టింపయ్యాయి. ఫుడ్ డెలివరీ, ట్రావెల్, గేమింగ్, ఎంటర్టైన్మెంట్ తదితర రంగాలకు చెందిన యాప్ల వినియోగం గణనీయంగా పెరిగింది. గతేడాది భారతీయ డెవలపర్ల ఆదాయాల్లో దాదాపు 80 శాతం వాటా ఇతర దేశాల్లోని యూజర్ల నుంచే వచ్చింది. ఏడాది పొడవున యాప్ స్టోర్ నుంచి 75.5 కోట్ల సార్లు మన డెవలపర్ల యాప్లను యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నారు.ఇదీ చదవండి: వ్యాపార ‘పద్మా’లు..భారతదేశంలోని డెవలపర్ల సృజనాత్మకత, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడంలో యాప్ స్టోర్ కీలక పాత్ర పోషిస్తుంది. యాపిల్ వ్యాపార నమూనాలో ‘ఫ్రీ’మియం(ఉచితం) యాప్లు, పెయిడ్ యాప్లు, ఇన్-యాప్ పర్చేజ్లు లేదా సబ్స్క్రిప్షన్లతో కూడిన యాప్లు వంటి వివిధ మానిటైజేషన్ విధానాలు ఉన్నాయి. ఇది డెవలపర్లను వారి లక్ష్యాలకు అనుగుణంగా టార్గెటెడ్ ఆడియన్స్ను ఎంచుకునేందుకు వీలు కల్పిస్తుంది. -
‘బుల్లి బాయ్’ సృష్టికర్త అరెస్ట్
న్యూఢిల్లీ: ముస్లిం మహిళల ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి వేలానికి పెట్టిన ‘బుల్లి బాయ్’ యాప్ సృష్టికర్తని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అస్సాంకు చెందిన నీరజ్ బిష్ణోయ్ (21) ఈ యాప్ను తయారు చేశాడని, అతనే ఈ కేసుకి ప్రధాన సూత్రధారి అని పోలీసులు తెలిపారు. గురువారం ఉదయం అస్సాంలోని నీరజ్ సొంతూరు జోర్హత్లో ఢిల్లీ పోలీసు యంత్రాంగానికి చెందిన ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (ఐఎఫ్ఎస్ఒ) బలగాలు అతనిని అదుపులోనికి తీసుకొని ఢిల్లీకి తీసుకువచ్చాయి. పోలీసులు జరిపిన విచారణలో అతను నేరాన్ని అంగీకరించినట్టుగా ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే ముంబై పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్టయిన వారిలో ఉత్తరాఖండ్కు చెందిన 19 ఏళ్ల యువతి శ్వేతా సింగ్ ప్రధాన నిందితురాలిగా ఇప్పటివరకు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నీరజ్ మధ్యప్రదేశ్లోని భోపాల్లో వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోబీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గిట్హబ్ ప్లాట్ఫారమ్లో బుల్లి బాయ్ యాప్ తయారు చేసి దానికి సంబంధించిన ప్రధాన ట్విట్టర్ అకౌంట్ అతనే నడుపుతున్నాడని ఐఎఫ్ఎస్ఒ డిప్యూటీ కమిషనర్ కేపీఎస్ మల్హోత్రా మీడియాకి చెప్పారు. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమైన ఇంటర్నెట్ ప్రోటోకాల్ డిటైల్ రికార్డ్స్ (ఐపీడీఆర్), ఇతర గేట్ వేల సహాయంతో అతని జాడని కనిపెట్టామని చెప్పారు. నీరజ్ ల్యాప్టాప్లో కూడా ఈ యాప్ని తయారు చేసినట్టుగా ఫోరెన్సిక్ ఆధారాలు లభించాయని తెలిపారు. -
గూగుల్తో పేటీఎం ఢీ..!
న్యూఢిల్లీ: కొద్ది రోజుల క్రితం నిబంధనల ఉల్లంఘన పేరుతో తమ యాప్ను ప్లేస్టోర్ నుంచి తొలగించిన టెక్ దిగ్గజం గూగుల్తో తలపడేందుకు దేశీ ఈ–కామర్స్ చెల్లింపుల సంస్థ పేటీఎం సిద్ధమయ్యింది. ఇందులో భాగంగా తాజాగా దేశీ డెవలపర్ల కోసం ఆండ్రాయిడ్ మినీ యాప్ స్టోర్ను ఆవిష్కరించింది. తమ యాప్లో అంతర్గతంగా మినీ–యాప్స్ను లిస్టింగ్ చేయడానికి ఎటువంటి చార్జీలు ఉండబోవని తెలిపింది. అలాగే, యూజర్లు.. పేటీఎం వ్యాలెట్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, యూపీఐ, నెట్–బ్యాంకింగ్, కార్డులు మొదలైన వాటి ద్వారా చెల్లింపులు జరిపేలా డెవలపర్లు ప్రత్యామ్నాయ అవకాశాలు ఇవ్వొచ్చని పేర్కొంది. క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులపై మాత్రం 2 శాతం చార్జీ ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఈ యాప్ స్టోర్ బీటా వెర్షన్ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు పేర్కొంది. డెకాథ్లాన్, ఓలా, పార్క్ప్లస్, ర్యాపిడో, నెట్మెడ్స్, 1ఎంజీ, డోమినోస్ పిజ్జా, ఫ్రెష్మెనూ, నోబ్రోకర్ వంటి 300 పైచిలుకు యాప్ ఆధారిత సర్వీసుల సంస్థలు ఇప్పటికే ఇందులో చేరినట్లు పేటీఎం తెలిపింది. ‘ప్రతీ భారతీయ యాప్ డెవలపర్కూ సాధికారత కల్పించేలా పేటీఎం మినీ యాప్ స్టోర్ ఆవిష్కరించడం సంతోషకరమైన విషయం‘ అని పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. పేటీఎం యూజర్లు ప్రత్యేకంగా ఆయా యాప్లను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని, తమకు నచ్చిన పేమెంట్ ఆప్షన్ల ద్వారా చెల్లింపులు చేసే వీలుంటుందని పేర్కొన్నారు. పరిమిత స్థాయిలో డేటా, ఫోన్ మెమరీ గల యూజర్లకు ఇలాంటి మినీ యాప్స్ ఉపయోగకరంగా ఉంటాయని వివరించారు. గూగుల్తో వివాదం.. టెక్నాలజీ ఆధారిత ఆర్థిక సేవల విభాగంలో గూగుల్తో పేటీఎం పోటీపడుతున్న సంగతి తెలిసిందే. అయితే, క్యాష్బ్యాక్ ఆఫర్తో నిబంధనలకు విరుద్ధంగా క్రీడల బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ సెప్టెంబర్ 18న పేటీఎం యాప్ను గూగుల్ తమ ప్లే స్టోర్ నుంచి కొన్ని గంటలపాటు తొలగించింది. సదరు ఫీచర్ను తొలగించిన తర్వాతే మళ్లీ ప్లేస్టోర్లో చేర్చింది. గూగుల్ తన మార్కెట్ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి, పోటీ సంస్థలను అణగదొక్కేందుకే ఇలాంటి పక్షపాత విధానాలు అమలు చేస్తోందని పేటీఎం ఆరోపించింది. ప్లేస్టోర్ ద్వారా ఆండ్రాయిడ్ యాప్స్పై గూగుల్కు గుత్తాధిపత్యం ఉండటం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని వ్యాఖ్యానించింది. ఆ తర్వాత విమర్శలు వెల్లువెత్తడంతో గూగుల్ తమ విధానాలపై వివరణనిచ్చింది. ప్లే స్టోర్ ద్వారా డిజిటల్ కంటెంట్ విక్రయించే యాప్స్ కచ్చితంగా గూగుల్ ప్లే బిల్లింగ్ సిస్టమ్నే ఉపయోగించాలని, ఇన్–యాప్ కొనుగోళ్లకు సంబంధించి నిర్దిష్ట శాతం ఫీజుగా చెల్లించాల్సిందేనని పేర్కొంది. దీనిపై డెవలపర్లు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో భారత్లోని డెవలపర్లు.. ప్లే బిల్లింగ్ సిస్టమ్తో తమ యాప్లను అనుసంధానించేందుకు గడువును 2020 మార్చి 31 దాకా పొడిగించింది. ఫ్లిప్కార్ట్తో జట్టు.. పండుగ సీజన్ నేపథ్యంలో పేటీఎంతో చేతులు కలిపినట్లు ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తెలిపింది. ది బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసే యూజర్లు.. పేటీఎం వ్యాలెట్, పేటీఎం యూపీఐ ద్వారా చెల్లింపులు జరిపేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని పేర్కొంది. అంతేగాకుండా ఫ్లిప్కార్ట్ కస్టమర్లు తమ పేటీఎం వ్యాలెట్లలో తక్షణ క్యాష్బ్యాక్ పొందవచ్చని వివరించింది. అక్టోబర్ 16 నుంచి 21 దాకా ఫ్లిప్కార్ట్ ‘ది బిగ్ బిలియన్ డేస్’ సేల్ నిర్వహిస్తుండగా, ఆ సంస్థలో భాగమైన ఫ్యాషన్ విభాగం మింత్రా కూడా అక్టోబర్ 16 నుంచి 22 దాకా ’బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్’ నిర్వహిస్తోంది. అటు, మ్యాక్స్ ఫ్యాషన్తో కూడా జట్టు కట్టినట్లు మింత్రా మరో ప్రకటనలో వెల్లడించింది. -
యాప్ డెవలపర్లకు ఫేస్బుక్ తోడ్పాటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ యాప్ డెవలపర్లకు తోడ్పాటు అందించే దిశగా సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ మరింతగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా రెండేళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఎఫ్బీస్టార్ట్ ప్లాట్ఫాంకు మంచి స్పందన లభిస్తోందని, ఇప్పటిదాకా 137 దేశాలకు చెందిన 9,000 మంది పైచిలుకు డెవలపర్లు ఉపయోగించుకున్నట్లు ఫేస్బుక్ ఇండియా ప్రోడక్ట్ పార్ట్నర్షిప్స్ విభాగం అధిపతి సత్యజిత్ సింగ్ తెలిపారు. ఎఫ్బీస్టార్ట్ కింద కొత్తగా జోడించిన వాటితో కలిపి మొత్తం 25 సర్వీసులను అందిస్తున్నామన్నారు. వీటి విలువ సుమారు 80,000 డాలర్ల దాకా ఉంటుందని చెప్పారు. ఎఫ్బీస్టార్ట్ ప్లాట్ఫాంను డెవలపర్లకు చేరువ చేసే దిశగా నిర్వహించిన రోడ్షోలో పాల్గొనేందుకు గురువారం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా సింగ్ ఈ విషయాలు చెప్పారు. చండీగఢ్, ముంబై తదితర 8 నగరాల్లో రోడ్షోలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వినూత్నమైన ఐడియాలను డెవలపర్లు మెరుగైన యాప్ కింద మల్చుకుని, తర్వాత దశల్లో స్టార్టప్లను కూడా ఏర్పాటు చేసుకుని ఎదిగేందుకు ఎఫ్బీస్టార్ట్లోని సర్వీసులు ఉపయోగపడగలవని సింగ్ వివరించారు. హెల్త్ స్టార్టప్ మైచైల్డ్, క్యాష్బాక్ సంస్థ లాఫలాఫా మొదలైనవి వీటిని ఉపయోగించుకున్నట్లు పేర్కొన్నారు. -
యాప్ డెవలపర్స్కు ఫేస్బుక్ తోడ్పాటు
హైదరాబాద్: మొబైల్ యాప్ డెవలపర్లకు తోడ్పాటు అందించే దిశగా ఫేస్బుక్ మరింతగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా రెండేళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఎఫ్బీ స్టార్ట్ ప్లాట్ఫాంకు మంచి స్పందన లభిస్తోందని, ఇప్పటిదాకా 137 దేశాలకు చెందిన 9,000 మంది పైచిలుకు డెవలపర్లు ఉపయోగించుకున్నట్లు ఫేస్బుక్ ఇండియా ప్రొడక్ట్ పార్ట్నర్షిప్స్ విభాగం అధిపతి సత్యజిత్ సింగ్ తెలిపారు. ఎఫ్బీ స్టార్ట్ కింద కొత్తగా జోడించిన వాటితో కలిపి మొత్తం 25 సర్వీసులను అందిస్తున్నామన్నారు. వీటి విలువ 80,000 డాలర్ల దాకా ఉంటుందని చెప్పారు. ఎఫ్బీస్టార్ట్ ప్లాట్ఫాంను డెవలపర్లకు చేరువ చేసే దిశగా నిర్వహించిన రోడ్షోలో పాల్గొనేందుకు గురువారం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా సింగ్ ఈ విషయాలు చెప్పారు. కొచ్చి, చెన్నై, ముంబై తదితర 8 నగరాల్లో రోడ్షోలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వినూత్నమైన ఐడియాలను డెవలపర్లు మెరుగైన యాప్ కింద మల్చుకుని, తర్వాత దశల్లో స్టార్టప్లను కూడా ఏర్పాటు చేసుకుని ఎదిగేందుకు ఎఫ్బీస్టార్ట్లోని సర్వీసులు ఉపయోగపడగలవని సింగ్ వివరించారు. హెల్త్ స్టార్టప్ మైచైల్డ్, క్యాష్బాక్ సంస్థ లాఫలాఫా మొదలైనవి వీటిని ఉపయోగించుకున్నట్లు పేర్కొన్నారు. భారత్లోని టాప్ యాప్లలో సుమారు 75 శాతం అప్లికేషన్స్.. ఫేస్బుక్తో అనుసంధానమయ్యాయని సింగ్ చెప్పారు. -
‘మొబైల్10ఎక్స్’ను ఆవిష్కరించిన ఐఏఎంఏఐ
న్యూఢిల్లీ: మొబైల్ యాప్ డెవలపర్ల వృద్ధికి దోహదపడే విధంగా మొబైల్ ఇంటర్నెట్ సమాఖ్య ఐఏఎంఏఐ ‘మొబైల్10ఎక్స్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం 50 వేలుగా ఉన్న మొబైల్ యాప్ డెవలపర్ల సంఖ్యను వచ్చే ఐదేళ్లలో ఐదు లక్షలకు చేర్చడం... అలాగే మొబైల్ యాప్ విభాగం ఆదాయాన్ని రూ.1000 కోట్ల నుంచి రూ.10,000 కోట్లకు పెంచటమే ఈ కార్యక్రమ లక్ష్యం. దీనికి గూగుల్ ఇండియా, పేటీఎం సంస్థలు ప్రారంభ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఐఏఎంఏఐ ఈ కార్యక్రమం కింద వచ్చే ఐదేళ్లలో ఐదు మొబైల్ స్టార్టప్ హబ్లను ఏర్పాటు చేయనుంది. వీటిని బెంగళూరు, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, పుణే/ముంబై పట్టణాల్లో ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని ఐఏఎంఏఐ ప్రెసిడెంట్ సుభో రాయ్ తెలిపారు. వీటిల్లో డెవలపర్లు స్వేచ్ఛగా పనిచేసుకోవడానికి అవసరమైన టెస్టింగ్ ల్యాబ్, డిజైన్ ల్యాబ్, కెపాసిటీ బిల్డింగ్ వంటి తదితర సౌలభ్యాలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమం కింద 5 లక్షల ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆండ్రాయిడ్, ఓఎస్ ప్లాట్ఫామ్స్పై శిక్షణను ఇస్తామని తెలిపారు. భారత్లో యాప్ డెవలప్మెంట్కు మంచి అవకాశాలు ఉన్నాయని గూగుల్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ ఆనందన్ పేర్కొన్నారు.


