captaincy record
-
బంగ్లాదేశ్ కెప్టెన్ ప్రపంచ రికార్డు!
పాకిస్తాన్ను తమ సొంతగడ్డపై ఓడించి టెస్టు సిరీస్ను క్లీన్స్వీప్ చేసి బంగ్లాదేశ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొసెన్ షాంటో కూడా ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. పాకిస్తాన్పై గెలుపుతో బంగ్లాదేశ్ తరఫున టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్గా నజ్ముల్ షాంటో రికార్డులకెక్కాడు. షాంటో సారథ్యంలో బంగ్లాదేశ్ 18 టెస్టు మ్యాచ్లు ఆడితే అందులో 8 విజయాలు, 9 ఓటములు, ఒక డ్రా ఉన్నాయి. షాంటో కంటే ముందు ముష్ఫికర్ రహీమ్ కెప్టెన్సీలో బంగ్లా సాధించిన ఏడు టెస్టు విజయాలే ఇప్పటివరకు అత్యుత్తమంగా ఉండేది. తాజాగా షాంటో ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఇక ముష్ఫికర్ రహీమ్ సారథ్యంలో బంగ్లాదేశ్ 34 టెస్టులు ఆడింది. ఇందులో 7 విజయాలు, 18 ఓటములు, 9 డ్రాలు ఉన్నాయి. స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ నేతృత్వంలో 19 టెస్టులు ఆడిన బంగ్లా 4 విజయాలు, 15 ఓటములు చవిచూసింది. మోమినుల్ హక్ సారథ్యంలో 17 మ్యాచ్లాడిన బంగ్లాదేశ్ మూడు విజయాలు సాధించి, 12 ఓటములు, రెండు డ్రాలు చేసుకుంది. ఈ లెక్కన నజ్ముల్ హసన్ షాంటో సారథ్యంలో బంగ్లాదేశ్ టెస్టుల్లో ఎక్కువ విజయాలు సాధించడంతో అతడి కెప్టెన్సీ విన్నింగ్ శాతం అందరికంటే అధికంగా ఉంది. మ్యాచ్ విషయానికొస్తే సిల్హెట్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన రెండో టెస్ట్లో 78 పరుగుల తేడాతో విజయం సాధించిన బంగ్లాదేశ్ 2-0తో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది.437 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 316-7 స్కోర్ వద్ద చివరి రోజు ఆటను ప్రారంభించిన పాక్.. కొద్దిసేపటిలోనే మిగిలిన 3 వికెట్లు కోల్పోయి 358 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్నైట్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ (94) పాక్ను గట్టెక్కించే ప్రయత్నంలో విఫలమయ్యాడు. అతని పోరాటం వృధా అయ్యింది. తైజుల్ ఇస్లాం (34.2-4-120-6) అద్భుత ప్రదర్శనలతో పాక్ పతనాన్ని శాసించాడు.Sylhet witnesses a memorable triumph. pic.twitter.com/Vbi39tQpih— Bangladesh Cricket (@BCBtigers) May 20, 2026చదవండి: పాక్ మాజీ క్రికెటర్కు బంపరాఫర్.. ఐపీఎల్కు అర్హత! -
IPL 2026: ఆరంభం రోజునే ఇషాన్ అరుదైన రికార్డు!
సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) కెప్టెన్ ఇషాన్ కిషన్ ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభ మ్యాచ్తోనే అరుదైన రికార్డు అందుకోనున్నాడు. ఇవాళ చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో ఎస్ఆర్హెచ్ అమీతుమీ తేల్చుకోనుంది. ప్రస్తుతం ఇషాన్ కిషన్ వయసు 27 సంవత్సరాల 253 రోజులు. దీంతో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ చరిత్రలో కెప్టెన్గా జట్టును నడిపించనున్న రెండో అత్యంత పిన్న వయస్కుడిగా ఇషాన్ కిషన్ నిలవ నున్నాడు. అంతేకాదు టీమిండియా తరఫున ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగాను ఇషాన్ నిలవనున్నాడు. ఈ జాబితాలో తొలి స్థానంలో న్యూజిలాండ్ సీనియర్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ఉన్నాడు. 2018లో ఎస్ఆర్హెచ్కు కెప్టెన్గా వ్యవహరించినప్పుడు విలియ మ్సన్ వయసు 27 సంవత్సరాల 244 రోజులు. గతంలో శిఖర్ ధావన్, మనీష్పాండే, భువనేశ్వర్ కుమార్లు కూడా తక్కువ వయసులోనే ఎస్ఆర్హెచ్ కెప్టెన్లుగా వ్యవహరించారు. ఇక ఎస్ఆర్హెచ్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ వెన్ను నొప్పితో సీజన్ ఆరంభ మ్యాచ్లకు దూరమైన సంగతి తెలిసిందే. కమిన్స్ స్థానంలో ఇషాన్ కిషన్కు తాత్కాలికంగా నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పుతూ ఎస్ఆర్హెచ్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అయితే కమిన్స్ ఈ సీజన్లో మొదటి సగం మ్యాచ్లకు దూరమైనట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఖండించిన ఎస్ఆర్హెచ్ కోచ్ డేనియల్ వెటోరి కమిన్స్ ఆడడంపై స్పష్టతనిచ్చాడు. కమిన్స్ ఫిట్గానే ఉన్నాడని, మరో 10 నుంచి 12 రోజుల్లో బరిలోకి దిగనున్నట్లు పేర్కొన్నాడు. మరోవైపు కమిన్స్ ఫిట్నెస్పై క్రికెట్ ఆస్ట్రేలియా కూడా దృష్టి సారించిందని తెలిపాడు. వరుస గాయాలతో ఇప్పటికే యాషెస్, టీ20 ప్రపంచకప్కు కమిన్స్ దూరమైన సంగతి తెలిసిందే. ఇక ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, క్లాసెన్, లివింగ్స్టోన్, నితీశ్కుమార్రెడ్డిలతో పటిష్టంగా కనిపిస్తుంది. అయితే కమిన్స్ లేకపోవడంతో బౌలింగ్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్ సహా దేశవాలీ క్రికెటర్లు కీలకం కానున్నారు.చదవండి: వివాదంలో యువరాజ్ తండ్రి! -
విరాట్ కోహ్లి దిగ్గజ కెప్టెన్ ఎలా అవుతాడు.. ?
Sanjay Manjrekar Comments On Virat Kohli Captaincy: టీమిండియా స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై వివాదాస్పద వ్యాఖ్యాత, భారత మాజీ ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లిని భారత ఆల్టైమ్ దిగ్గజ కెప్టెన్ల జాబితాలో చేర్చలేమని, ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా అందించలేని వ్యక్తిని అలా ఎలా పరిగణిస్తారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గతంలో టీమిండియాకు కెప్టెన్లుగా వ్యవహరించిన వారితో పోలిస్తే కోహ్లి చేసిందేమీ లేదని, కేవలం మీడియా హైప్ మూలంగానే అతనికి అర్హతకు మించి క్రెడిట్ దక్కిందని కోహ్లిపై అక్కసును వెల్లగక్కాడు. అయితే, ఆటగాడిగా తన పాత్రకు న్యాయం చేశాడని కోహ్లి అభిమానులకు ఊరట కలిగించే కామెంట్స్ చేశాడు. భారత క్రికెట్ జట్టు దిగ్గజ కెప్టెన్లలో ధోని ముఖ్యుడని, అతని సారధ్యంలో టీమిండియా అంతర్జాతీయ వేదికలపై మరపురాని విజయాలు నమోదు చేసిందని, ఈ క్రమంలో భారత్ ఎన్నో ఐసీసీ ట్రోఫీలను సాధించిందని, కెప్టెన్ సక్సెస్కు ఐసీసీ టోర్నీల్లో గెలుపే కొలమానమని, ఈ విషయంలో ధోని దరిదాపుల్లో కూడా కోహ్లి ఉండడని తన స్టైల్లో లాజిక్ను వివరించాడు. స్వదేశంలో విజయాలు, ద్వైపాక్షిక సిరీస్ల్లో విజయాలను ఐసీసీ ఈవెంట్లలో గెలుపుతో పోల్చలేమని ఆయన అభిప్రాయపడ్డాడు. దిగ్గజ కెప్టెన్ల విషయానికొస్తే.. తన దృష్టిలో టీ20, వన్డే ప్రపంచప్లతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీని అందించిన ధోని, 1983 ప్రపంచకప్ను అందించిన కపిల్ ముఖ్యులని పేర్కొన్న మంజ్రేకర్.. టీమిండియాకు దూకుడు నేర్పిన గంగూలీ, సునీల్ గవాస్కర్లను కూడా దిగ్గజ కెప్టెన్లతో పోల్చకుండా ఉండలేమని తెలిపాడు. అయితే, కెప్టెన్సీ విషయంలో కోహ్లికి తనదైన స్టైల్ ఉందని, ఓటమిని అంత ఈజీగా అంగీకరించడని, ఇటీవలి దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్ట్ సిరీస్లో అది మరోసారి నిరూపితమైందని గుర్తు చేశాడు. కోహ్లి ఎంతటి పోరాటపటిమ కనబర్చినప్పటివకీ, దురదృష్టం అతన్ని వెంటాడిందని అన్నాడు. 7 ఏళ్ల కెప్టెన్సీ కెరీర్లో కేవలం రెండు పర్యాయాలు మాత్రమే ఐసీసీ టోర్నీల్లో కోహ్లి టీమిండియాను ఫైనల్కు చేర్చిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. కాగా, దక్షిణాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం కోహ్లి సంపూర్ణంగా టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. చదవండి: IPL: విరాట్ కోహ్లి సహచరుడిపై పోలీసుల దాడి..! -
ధోని ఖాతాలోకి ‘అనుకోని’ ఘనత
దుబాయ్: ఆసియా కప్లో భాగంగా అఫ్గనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడంతో సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోని అనుకోకుండా టీమిండియాకు నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్తో టీమిండియా తరుపున 200 వన్టేలకు నాయకత్వం వహించిన ఘనత మిస్టర్ కూల్కు దక్కింది. అయితే అఫ్గాన్తో మ్యాచ్లో జార్ఖండ్ డైనమెట్ ఖాతాలో మరో రికార్డు చేరిందని ఐసీసీ ట్వీట్ చేసింది. టీమిండియాకు నాయకత్వం వహించిన అతి పెద్ద వయస్కుడిగా (37ఏళ్ల 80రోజులు) మిస్టర్ కూల్ అనుకోని రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో హైదరాబాదీ ఆటగాడు మహ్మద్ అజారుద్దీన్( 36 ఏళ్ల 124 రోజులు) రికార్డును ధోని సవరించాడు. ఇక ఓవరాల్గా టీమిండియాకు (మహిళల మరియు పురుషుల) నాయకత్వం వహించిన జాబితాలో దిగ్గజ క్రీడాకారిణి డియానా ఎడుల్జి (37 ఏళ్ల 184 రోజులు) తొలి స్థానంలో నిలవగా, ధోని రెండో స్థానంలో ఉన్నాడు. ( ఊరించి... ఉత్కం‘టై’ ) 2017 ఆరంభంలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న అనంతరం తాజాగా ఆసియా కప్లో భాగంగా అఫ్గాన్తో జరిగిన మ్యాచ్లో ధోని టీమిండియాకు సారథిగా వ్యవహరించాడు. అయితే ఈ మ్యాచ్ ‘టై’ గా ముగియడంతో ధోనితో సహా అభిమానలు తీవ్ర నిరాశకు గురయ్యారు. కేఎల్ రాహుల్ రివ్యూ వృథా చేయడం, ఒక్క పరుగు తీస్తే జట్టు విజయం సాధించే దశలో 140 వన్డేల అనుభవం వున్న రవీంద్ర జడేజా నిర్లక్ష్యంగా ఔట్ అవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ఆసియాకప్ టోర్నీ ఫైనల్లో శుక్రవారం బంగ్లాదేశ్తో అమీతుమీకి సిద్దమైంది. చదవండి: బౌలింగ్ చేస్తావా.. నిన్నే మార్చాలా : ధోని -
కోహ్లీకి సాధ్యంకాని ధోనీ రికార్డు
ముంబై: మహేంద్ర సింగ్ ధోనీ వారసుడిగా టీమిండియా కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన విరాట్ కోహ్లీ తక్కువ కాలంలోనే రాటుదేలాడు. టెస్టు క్రికెట్లో జట్టుకు ఘనవిజయాలు అందించాడు. బ్యాట్స్మన్గా అద్భుతాలు చేస్తున్నాడు. రికార్డుల దిశగా వెళ్తున్నాడు. కాగా కెప్టెన్గా ధోనీ నెలకొల్పిన రికార్డును కొనసాగించడంలో విఫలమయ్యాడు. టెస్టు క్రికెట్లో ధోనీ సారథ్యంలో భారత్ ఎప్పుడూ సొంతగడ్డపై ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చెందలేదు. ఆస్ట్రేలియాతో ఎనిమిది టెస్టుల్లో ధోనీసేన విజయం సాధించింది. మూడు సిరీస్ లను సొంతం చేసుకుంది. ఓవరాల్ గా విరాట్ సారథ్యంలో టీమిండియాకు 19 టెస్టుల్లో ఓటమెరుగని రికార్డు ఉంది. కాగా పుణెలో జరిగిన ఆసీస్తో తొలిటెస్టులో కోహ్లీ సేన చిత్తుగా ఓడింది. దీంతో ధోనీ కెప్టెన్సీ రికార్డును కోహ్లీ తిరగరాసే అవకాశం కోల్పోయాడు. 2008-09 సీజన్లో సొంతగడ్డపై ధోనీసేన ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ను ఆడింది. ఈ సిరీస్ను భారత్ 2-0తో గెల్చుకుంది. 2010-11 సీజన్లోనూ ధోనీసేన ఇదే విజయాన్ని పునరావృతం చేసింది. ఇక 2012-13 సీజన్లో భారత్ 4-0తో కంగారూలను చిత్తుగా ఓడించింది.


