సాక్షి, శ్రీశైలం: మరోసారి శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో మళ్లీ పేలుడు సంభవించింది. బుధవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. భారీ శబ్ధాలతో మంటలు ఎగసిపడటంతో భయంతో పవర్ ప్లాంట్ సిబ్బంది బయటకు పరుగులు తీశారు. కరెంట్ కేబుల్ పైనుంచి డీసీఎం వ్యాన్ వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో ఇవాళ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. ఉద్యోగులు, సిబ్బంది ఎలా అప్రమత్తంగా ఉండాలి...ప్రమాదాల నుంచి ఎలా తప్పించుకోవాలో శిక్షణ ఇచ్చేందుకు మాక్ డ్రిల్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. గత నెల 20వ తేదీన శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదం సంభవించి తొమ్మిది మంది సిబ్బంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అగ్ని ప్రమాదంపై సీఐడీ విచారణ కొనసాగుతోంది.
శ్రీశైలం పవర్ ప్లాంట్లో మళ్లీ పేలుడు?
Sep 2 2020 7:10 PM | Updated on Mar 21 2024 7:59 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement