ప్రధాన కార్యదర్శిపై దాడికి పాల్పడిన ఆప్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఐఏఎస్లు కోరుతున్నారు. ఈ మేరకు మంగళవారం వారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ను కలిసి వినతి పత్రం అందజేశారు.
‘నిధుల ఖర్చుల విషయంలో కేజ్రీవాల్ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తుంది. దానిని సీఎస్ ప్రశ్నించినందుకే ఎమ్మెల్యేలు దాడికి పాల్పడ్డారు’ అని వారు వివరించారు. ఆప్ ఎమ్మెల్యేలు గూండాల్లా ప్రవర్తిస్తున్నారని.. రాష్ట్రంలో అధికారులకు రక్షణే లేకుండా పోయిందంటూ వారు ఎల్జీ వద్ద వాపోయినట్లు తెలుస్తోంది.