వైఎస్ విజయమ్మతో మనసులోమాట | Sakshi
Sakshi News home page

వైఎస్ విజయమ్మతో మనసులోమాట

Published Sun, Jan 28 2018 9:54 PM

ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తన బిడ్డ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదించాలని ఆయన తల్లి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ విజ్ఞప్తి చేశారు. తన తండ్రిలాగే ప్రజల కోసం మంచి పనులు చేసి చరిత్రలో నిలిచిపోవాలన్న తపన జగన్‌లో ఉందన్నారు. ఇచ్చిన మాట తప్పే మనిషి కాదని అన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణానంతరం ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నందుకే తాము కాంగ్రెస్‌ పార్టీ నుంచి వెళ్లిపోయే పరిస్థితులు సృష్టించారని చెప్పారు