దేశంలో, రాష్ట్రంలో ప్రస్తుతం విచిత్ర పరిస్థితులున్నాయని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. బ్యాంకుల్లో డబ్బుల్లేవు.. జనం ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వాల అంకెల గారడీ తప్ప.. అభివృద్ధి లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని బొత్స ధ్వజమెత్తారు. అంతేకాక కిడ్నాప్లు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారని.. ఆ తర్వాత ప్యాకేజీకి ఒప్పుకున్నారని ఆయన విమర్శించారు.
Apr 19 2018 7:13 PM | Updated on Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement