ఒలంపిక్స్లో ఆశించిన రీతిలో పతకాలు సాధించకపోవడానికి మౌలిక సదుపాయాల లేమినే ప్రధాన కారణంగా ఎత్తిచూపుతూ తీవ్ర చర్చలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్ చర్చనీయాంశమైన కామెంట్ చేశారు. తొమ్మిది బంగారు పతకాలు గెలుచుకున్న జమైకా ప్లేయర్ ఉసేన్ బోల్ట్, రోజుకి రెండు సార్లు ప్రొటీన్ ఆహారం బీఫ్ తినడం వల్లనే విజయాన్ని సాధించాడని ఆయన ట్వీట్ చేశారు. . బోల్ట్ది పేదకుటుంబమైనప్పటికీ రోజుకి రెండు సార్లు బీఫ్ తినాలని తన ట్రైనర్ సలహా ఇచ్చాడని పేర్కొన్నారు. ఓ వైపు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీఫ్ను నిషేధిస్తున్న నేపథ్యంలో ఉదిత్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. భారత్లో అథ్లెటిక్స్కు సరియైన సదుపాయాలు లేకపోవడం వల్లనే పతకాలు ఆర్జించలేకపోతున్నారనే ఆరోపణలపై స్పందనగా ఆయన ఈ ట్వీట్ లు చేశారు.ఆయన చేసిన ఈ ట్వీట్లు 200 సార్ల కంటే ఎక్కువగా రీట్వీట్ అయ్యాయి.
Aug 29 2016 3:46 PM | Updated on Mar 21 2024 10:58 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement