మెదక్ జిల్లాలో చిత్రమైన ఘటన జరిగింది. ఇద్దరి మరణానికి కారణమైన ఓ ట్రాక్టర్.. తనంతట తానే బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇలా ఎందుకు జరిగిందో చూసేవాళ్లెవరికీ అర్థం కాలేదు. విషయం ఏమిటంటే.. మెదక్ జిల్లా శివంపేట మండలం చండి గ్రామంలో కరెంటు స్తంభాల లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్.. దారిలో వెళ్తున్న నలుగురిని ఢీకొంది. దాంతో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ట్రాక్టర్ వెనక ఉండే ట్రైలర్ తిరగబడింది. రోడ్డు వారగా ఉన్న ట్రాక్టర్.. ట్రైలర్ రెండూ ట్రాఫిక్కు అడ్డంగా ఉండటంతో ఓ పొక్లెయిన్ను రప్పించి, దాంతో ట్రైలర్ను సరిచేశారు.
Mar 3 2017 11:24 AM | Updated on Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement