గాంధీ... మోదీ తర్వాత ప్రభాస్‌కే! | Prabhas to get a wax statue at Madame Tussauds, in Amarendra mould from Baahubali | Sakshi
Sakshi News home page

Oct 2 2016 8:26 AM | Updated on Mar 21 2024 9:51 AM

సత్యం, అహింసలే ఆయుధంగా చేసుకున్న జాతిపిత మహాత్మా గాంధీ. దేశ ప్రధాని నరేంద్ర మోదీ.. వీళ్లిద్దరి తర్వాత ఆ గౌరవం ప్రభాస్‌కే అంటే.. ఆ గౌరవం దేనికి సంబంధించినది అయ్యుంటుందా? అని ఆశ్చర్యపోవడం సహజం. రాజకీయాలతో సంబంధం లేని గౌరవం ఇది. మైనపు విగ్రహాల రూపకల్పనలో పేరున్న కళాకారిణి ‘మేడమ్ టుస్సాడ్’ పేరున లండన్‌లో ప్రసిద్ధ మ్యూజియమ్ ఉంది. అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రముఖుల మైనపు విగ్రహాల్ని అక్కడ పెడుతుంటారు. ప్రపంచంలోని పలు చోట్ల ఆ మ్యూజియమ్ బ్రాంచ్‌లున్నాయి. బ్యాంకాక్‌లోని శాఖలో మన దేశం నుంచి మహాత్మా గాంధీ, ఆ తర్వాత నరేంద్ర మోదీ బొమ్మలు అక్కడ పెట్టారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement