దేశ రాజధానిలో మరో పురాతన భవనం కుప్పకూలింది. బారా హిందూరావు ప్రాంతంలో ఓ మూడంతస్తుల భవనం ఈరోజు ఉదయం కూలింది. శిధిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. దాంతో శిధిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడినవారిని అధికారులు చికిత్స నిమిత్తం హిందూరావు ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఆరు అగ్నిమాపక వావహనాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం పురాతన భవనాలను కూల్చివేయాలని అధికారులను సూచించింది.
Oct 9 2013 9:46 AM | Updated on Mar 21 2024 9:10 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement