పోలీసు కుక్కలు అంటే వాసన చూసి దేన్నైనా పసిగడతాయి. సీఆర్పీఎఫ్లో కూడా ఇలాగే శిక్షణ పొందిన శునకాలు ఉన్నాయి. సరిగ్గా అలాంటిదే ఓ వీర శునకం.. మావోయిస్టులు అమర్చిన అత్యంత శక్తిమంతమైన ఐఈడీని గుర్తించి.. పలు ప్రాణాలను కాపాడింది. ఒడిసాలోని రాయగడ జిల్లాలోని హతమునిగూడ వద్ద మావోయిస్టులు ఐదు కిలోల ఐఈడీ (ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్)ను అమర్చారు. దాన్ని ఆక్సెల్ అనే సీఆర్పీఎఫ్ శునకం గుర్తించింది. అయితే, దాన్ని గుర్తించే సమయంలో దాని కాలికి, కంటి కింద తీవ్ర గాయాలయ్యాయి. తర్వాత బాంబు నిర్వీర్య దళం వచ్చి... ఆ బాంబును డిఫ్యూజ్ చేసింది.
Nov 4 2016 2:51 PM | Updated on Mar 21 2024 6:45 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement