అంధుడని కూడా చూడకుండా ముగ్గురు పిల్లలను అంధుల పాఠశాల కరస్పాండెంట్ బెత్తం పట్టుకుని చితకబాదేశారు. అది కూడా ఏదో తప్పు చేసిన వాళ్లను దండించినట్లు కాకుండా.. ఆ పిల్లలతో తనకు జన్మజన్మల విరోధం ఉన్నట్లుగా గొడ్డును బాదినట్లు కింద పడేసి కొట్టారు. ఇంత చేసిన సదరు కరస్పాండెంట్ కూడా అంధుడే కావడం గమనార్హం. ఈ దారుణ సంఘటన కాకినాడలోని గ్రీన్ఫీల్డ్స్ అంధుల పాఠశాలలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో 'సాక్షి టీవీ'కి ప్రత్యేకంగా దొరికింది. స్వయంగా తాను కూడా అంధుడే అయిన పాఠశాల కరస్పాండెంట్, పిల్లలు అల్లరి చేశాడని ముగ్గురిని పట్టుకుని పేకబెత్తంతో వీపుమీద ఎడాపెడా బాదేశాడు. వద్దు వద్దని కాళ్లు పట్టుకుని వేడుకుంటున్నా ఏమాత్రం కనికరించలేదు. కళ్లు కనిపించక ఓ పిల్లాడు వేరేవైపు తిరిగి ఉంటే, 'ఒరేయ్ అటు కాదురా.. నేను ఇక్కడున్నాను ఇటు తిరుగు' అంటూ తనవైపు తిప్పుకొని మళ్లీ మళ్లీ బెత్తంతో వీపుమీద ఎడాపెడా బాదేశాడు. ఆయనకు మరో వ్యక్తి కూడా దగ్గరుండి సహకరించాడు. దీనిపై 'సాక్షి టీవీ' సదరు కరస్పాండెంటును ప్రశ్నించగా.. అల్లరి చేసినప్పుడు పిల్లలను ఆమాత్రం దండించకపోతే ఎలా అని ఎదురు ప్రశ్నించాడు. ఇదే అంశంపై డీఈవో శ్రీనివాసుల రెడ్డిని సంప్రదించగా, తాము మండల విద్యాశాఖాధికారిని అక్కడకు పంపామని, విచారణ జరిపి విషయం తెలియగానే కరస్పాండెంటుపై అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా పెడతామని తెలిపారు. బాలల హక్కుల కమిషన్కు చెందని అచ్యుతరావు కూడా ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించారు. అసలు పిల్లల ఒంటిమీద చెయ్యి కూడా వెయ్యకూడదని, అలాంటిది అంధుడని కూడా చూడకుండా చిన్నారి ఒంటిమీద వాతలు తేలేలా అంతలా కొట్టడం అత్యంత హేయమైన ఘటన అని మండిపడ్డారు.
Jul 21 2014 12:30 PM | Updated on Mar 20 2024 5:03 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement