పెద్ద నోట్ల రద్దుతో బ్లాక్మనీకి భారీగా సహకరిస్తున్న ఆభరణ వర్తకులకు కేంద్రం షాకిచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. జువెల్లర్స్ రూ.500, రూ.1000 పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసే తుది గడువుగా నవంబర్ 15ను నిర్ణయించినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. బ్లాక్మనీ వ్యాపారాలను నిర్మూలించేందుకు బంగారం వర్తకులకు అడ్డుకట్టవేసేందుకు ప్రభుత్వం ఈ చర్యలకు సిద్దమైనట్టు సమాచారం. బంగారం, జువెల్లరీ మార్గాలలో బ్లాక్మనీని మార్చుకుంటున్నారని, ఈ నేపథ్యంలో బంగారానికి భారీగా డిమాండ్ పెరిగి కొన్ని ఆభరణ దుకాణాల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.50వేలకు పలికినట్టు తెలిసింది.
Nov 14 2016 12:31 PM | Updated on Mar 20 2024 5:04 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement