
తాళ్లపాక చెరువులో వెలుగులోకి ప్రాచీన శివలింగం
రాజంపేట : పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలి తాళ్లపాక చెరువులో నేరుడుగడ్డగా పిలిచే ప్రాంతంలో ప్రాచీన శివలింగం వెలుగులోకి వచ్చింది. సోమవారం చెరువు అభివృద్ధి పనుల్లో భాగంగా వెయ్యేళ్ల చరిత్ర కలిగిన సుమారు ఆరు అడుగుల ఎత్తు కలిగిన శివలింగం బయటపడింది. అదే విధంగా పురాతనమైన రోలు వెలుగుచూసింది. దీంతో గ్రామస్తులు, రాజంపేట పరిసర ప్రాంతాల ప్రజలు తండోపతడాలుగా తాళ్లపాక చెరువు వద్దకు చేరుకున్నారు. శివలింగానికి అభిషేకాలు, పూజలు చేశారు. శ్రీ సిద్దేశ్వరాలయం ప్రధాన అర్చకులు భక్తవత్సలం స్వామి పూజలు నిర్వహించారు. తాళ్లపాక చెరువులో వెలుగులోకి వచ్చిన పురానత శివలింగంపై బీజెపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతుగుంట రమేష్నాయుడు, రిటైర్డ్ పాలిటెక్నికల్ ప్రిన్సిపాల్ ఉద్దండం సుబ్రమణ్యం మాట్లాడుతూ ఇక్కడతవ్వకాలు చేపడితే చరిత్ర బయపడుతుందన్నారు. తాళ్లపాక చెరువు అభివృద్ధిలో భాగంగా శివాలయం కూడా నిర్మితం చేసే విధంగా టీటీడీ యోచించాలన్నారు.