బాధితులకు చట్టపరిధిలో న్యాయం చేయండి | - | Sakshi
Sakshi News home page

బాధితులకు చట్టపరిధిలో న్యాయం చేయండి

Jul 15 2025 6:37 AM | Updated on Jul 15 2025 6:37 AM

బాధితులకు చట్టపరిధిలో న్యాయం చేయండి

బాధితులకు చట్టపరిధిలో న్యాయం చేయండి

– జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్‌ కుమార్‌

కడప అర్బన్‌: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పిజిఆర్‌ఎస్‌)కు వచ్చిన ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్‌ కుమార్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని పెన్నార్‌ పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాలులో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక( పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రిడ్రెస్సల్‌ సిస్టం ) కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించారు. జిల్లా నలు మూలల నుంచి విచ్చేసిన ప్రజలతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి 180 పిటీషన్‌లు వచ్చాయి. ఈ కార్యక్రమంలో డీటీసీ డీఎస్పీ అబ్దుల్‌ కరీం, మహిళా ిపీఎస్‌ డీఎస్పీ బాలస్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement