
నాడు కౌన్సిలర్.. నేడు కౌన్సిలర్ అభ్యర్థి
సాక్షి టాస్క్ఫోర్స్ : టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా పో లీసు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. సమాజాన్ని ఉద్దరించేందుకు ప్రజల పక్షాన పోరాటాలు చేసే క్రమంలో నమోదైన కేసుల్లో అయితే కాదు. అసాంఘిక కా ర్యకలాపాలు నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. మట్కా, క్రికెట్ బెట్టింగ్, పేకాట లాంటి జూదాలు పేద, మధ్య తరగతి కుటుంబాల రక్తాన్ని పీలుస్తూ వాళ్ల కుటుంబాలు వీధిన పడటానికి కారణం అవుతున్నాయి. కూలీ నాలీ చేసుకునే పేదలు వీటి బారిన పడుతున్నారు. వీరి బలహీనతను ఆసరాగా చేసుకొని కొందరు టీడీపీ నేతలు అసాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం జిన్నా రోడ్డులో మట్కా నిర్వహిస్తున్న టీడీపీ కౌన్సిలర్ను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో టీడీపీ నాయకుడు మట్కా నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తరపున 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసిన బండారు శ్రీనాథ్ను మట్కా కేసులో శుక్రవారం టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు మరో ఏడుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి కొంత మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. కొన్ని రోజుల క్రితం వన్టౌన్ పోలీస్స్టేషన్లో టీడీపీకి చెందిన పలువురు నాయకులపై క్రికెట్ బెట్టింగ్ నమోదు అయిన విషయం తెలిసిందే. మట్కా, క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న టీడీపీ నేతలపై వరుసగా కేసులు నమోదు అవుతుండటం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించడానికి కృషి చేయాల్సిన ఆ పార్టీ నేతలే వీటిని ప్రోత్సహించడంపై అనేక విమర్శలు వస్తున్నాయి.
మట్కా కేసుల్లో టీడీపీ నాయకులు

నాడు కౌన్సిలర్.. నేడు కౌన్సిలర్ అభ్యర్థి