ఏపీ ఈఏపీ సెట్‌లో మెరిశారు | - | Sakshi
Sakshi News home page

ఏపీ ఈఏపీ సెట్‌లో మెరిశారు

Jun 9 2025 7:03 AM | Updated on Jun 9 2025 7:03 AM

ఏపీ ఈ

ఏపీ ఈఏపీ సెట్‌లో మెరిశారు

కడప ఎడ్యుకేషన్‌: జిల్లాలో గత నెల 19 నుంచి 27వ తేదీ వరకు జరిగిన ఏపీ ఈఏపీ సెట్‌ ఫలితాలు ఆదివారం సాయంత్రం విడుదలయ్యాయి. ఇందులో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. ఉత్తమ్మ ర్యాంకులు సాధించి పలువురి ప్రశంసలు పొందారు.

ఇంజనీరింగ్‌ విభాగంలో...

జిల్లాలో ఇంజినీరింగ్‌ విభాగానికి సంబంధించి 13084 మంది రిజిస్టర్‌ చేసుకోగా 12554 మంది పరీక్షలు రాయగా ఇందులో 8545 మంది క్యాలిఫై అయ్యారు. ఇందులో బాలురు 4931 మంది, బాలికలు 3614 మంది క్వాలిఫై అయ్యారు.

అగ్రికల్చర్‌,ఫార్మసీకి సంబంధించి...

అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మాసీకి సంబంధించి జిల్లాలో 3424 రిజిస్టర్‌ చేసుకోగా 2286 మంది పరీక్ష రాశారు. ఇందులో 2835 మంది క్వాలిఫై అయ్యారు. బాలురు 804 మందికాగా బాలికలు 2031 మంది ఉన్నారు.

రాష్ట్రస్థాయిలో జశ్వంత్‌రెడ్డికి 16వ ర్యాంకు

ఏపీ ఈఏపీ సెట్‌ ఫలితాల్లో కడప భాగ్యనగర్‌ కాలనీకి చెెందిన మొలకల జశ్వంత్‌రెడ్డి మెరిశాడు. రాష్ట్రస్థాయిలో 16వ ర్యాంకు సాధించి భళా అనిపించాడు. మొలకల రాజకిషోర్‌రెడ్డి, శ్రీలతల కుమారుడు జశ్వంత్‌రెడ్డి 1 నుంచి 5వ తరగతి వరకు కడప నారాయణ ఈ టెక్నో స్కూల్లో చదివాడు. 6 నుంచి 10వ తరగతి వరకు నారాయణ ఒలంపియాడ్‌లో చదివాడు.ఇంటర్మీడియట్‌ను విజయవాడ కానూర్‌లోని నారాయణలో పూర్తి చేశాడు. ఇటీవల విడుదలైన జేఈఈ అడ్వాన్స్‌లో 211వ ర్యాంకు సాధించాడు. గతంలో విడుదలైన జేఈఈ మెయిన్స్‌లో 777వ ర్యాంకు సాధించాడు. దీంతోపాటు విట్‌లో 36వ ర్యాంకు, తెలంగాణా ఎంసెట్‌లో 38వ ర్యాంకును కై వసం చేసుకున్నాడు. జశ్వంత్‌రెడ్డి ర్యాంకు రావడంతో తల్లితండ్రులు హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్‌ రాజకిషోర్‌రెడ్డి సొంత గ్రామం వీరపునారయణపల్లె మండలం అనిమెల గ్రామం. అయితే ఆయన కడపలో స్థిరపడ్డారు. రాజకిషోర్‌రెడ్డి ప్రస్తుతం విజయవాడ డైరెక్టర్‌ ఆఫ్‌ అనిమల్‌ హస్బండిరీ లో వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌గా పనిచేస్తున్నారు.

మెరిసిన కృష్ణహర్షిత్‌

ఏపీ ఈఏసీ సెట్‌ పలితాల్లో కడప ఎన్‌జిఓ కాలనీకి చెందిన మంచాల కృష్ణ హర్షిత్‌ రాష్ట్రస్థాయిలో 37వ ర్యాంకును సాధించి మెరిశాడు. మంచాల ఈశ్వర్‌, రాధికల కుమారుడు కృష్ణహర్షిత్‌ చదువులో బాగా రాణిస్తూ ఇటీవల విడుదలైన ఐఐటీ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో కూడా 197వ ర్యాంకును సాధించాడు. చైన్నె ఐఐటీలో ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేసి.. సాప్ట్‌వేర్‌ రంగంలో అత్యున్నత స్థాయి ఉద్యోగాన్ని సాధించడమే లక్ష్యమని పేర్కొన్నారు. కృష్ణ హర్షిత్‌ తండ్రి మంచాల ఈశ్వర్‌ సిద్దవటం మండలం మాధవరం జెడ్పీ హైస్కూల్లో మ్యాథ్స్‌ టీచర్‌గా పనిచేస్తున్నాడు. కృష్ణ హర్షిత్‌కు ర్యాంకు రావడం పట్ల తల్లితండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

ఏపీ ఈఏపీ సెట్‌లో మెరిశారు1
1/1

ఏపీ ఈఏపీ సెట్‌లో మెరిశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement