మార్షల్‌ ఆర్ట్స్‌లో బంగారు పతకం | - | Sakshi
Sakshi News home page

మార్షల్‌ ఆర్ట్స్‌లో బంగారు పతకం

May 31 2025 1:18 AM | Updated on May 31 2025 1:18 AM

మార్షల్‌ ఆర్ట్స్‌లో బంగారు పతకం

మార్షల్‌ ఆర్ట్స్‌లో బంగారు పతకం

కడప ఎడ్యుకేషన్‌ : ఆల్‌ ఇండియా ఇంటర్‌ యూనివర్సిటీ చాంపియన్‌షిప్‌–2025లో మార్షల్‌ ఆర్ట్స్‌(పెన్‌– కాక్‌ సిలాట్‌)లో కడప బాలాజీ ఎంబీఏ కళాశాల విద్యార్థి జాన్‌ బెన్ని బంగారు పతకం సాధించినట్లు కరస్పాండెంట్‌ లేవాకు నితీష్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం జేఎన్‌టీయూ యూనివర్సిటీ తరపున బాలాజీ ఎంబీఏ కళాశాల విద్యార్థి బంగారు పతకం సాధించడం తమకెంతో గర్వకారణమన్నారు. ఇందుకు విద్యార్థికి రూ. 10 వేలు నగదుతో సత్కరించామని తెలిపారు. జూన్‌లో వియత్నాంలో జరిగే మార్షల్‌ ఆర్ట్స్‌లో భారత్‌ తరపున జాన్‌ బెన్ని పాల్గొంటాడని తెలిపారు. యూనివర్సిటీ ప్రొఫెసర్‌., స్పోర్ట్స్‌ ఇన్‌చార్జ్‌ జోజిరెడ్డి తమ కెంతో తోడ్పాటునిచ్చారని తెలిపారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్‌ హిమ్మల్‌, హాకీ చోక్‌ కళ్యాణ్‌ అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement