
‘జేఈఈ’లో మెరిసిన కడప కుర్రాడు
కడప ఎడ్యుకేషన్ : జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో కడపలోని భాగ్యనగర్కు చెెందిన మొలకల జశ్వంత్రెడ్డి మెరిశాడు. ఆల్ ఇండియా స్థాయిలో 211వ ర్యాంకు సాధించి భళా అనిపించాడు. మొలకల రాజకిషోర్రెడ్డి, శ్రీలత కుమారుడు జశ్వంత్రెడ్డి ఒకటి నుంచి 5వ తరగతి వరకు కడప నారాయణ ఈ టెక్నో స్కూల్లో చదివాడు. 6 నుంచి 10వ తరగతి వరకు నారాయణ ఒలింపియాడ్లో చదివాడు. ఆ తరువాత ఇంటర్మీడియెట్ను విజయవాడ కానూర్లోని నారాయణలో పూర్తి చేశాడు. ప్రస్తుతం విడుదలైన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో 211వ ర్యాంకును సాధించాడు. గతంలో విడుదలైన జేఈఈ మెయిన్స్లో 777వ ర్యాంకు సాధించాడు. దీంతోపాటు విట్లో 36వ ర్యాంకు, తెలంగాణా ఎంసెట్లో 38వ ర్యాంకును కై వసం చేసుకున్నాడు. డాక్టర్ రాజకిషోర్రెడ్డి సొంత గ్రామం వీరపునాయునిపల్లె మండలం అనిమెల అయితే కడపలో స్థిరపడ్డారు. ఆయన ప్రస్తుతం విజయవాడ డైరెక్టర్ ఆఫ్ యానియల్ హస్బెండరీలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్గా చేస్తున్నారు.
ఆల్ ఇండియా స్థాయిలో 211వ ర్యాంకు