
లారీ, చౌక బియ్యం స్వాధీనం
ఖాజీపేట : పేదలకు అందాల్సిన చౌక బియ్యాన్ని అడ్డదారిలో తరలించుకు పోతున్న లారీని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారి వివరాల మేరకు.. ప్రొద్దుటూరుకు చెందిన తాటి శాంతి కుమార్కు చెందిన ఏపీ 39 యూఏ 3609 నంబరు గల వాహనంలో 233 చౌక బియ్యం బస్తాలను ఎక్కించారు. బుధవారం తెల్లవారుజామున ప్రొద్దుటూరు నుంచి కడపకు తీసుకెళుతుండగా పక్కా సమాచారం మేరకు విజిలెన్స్ సీఐ శివన్న ఆయన బృందం వాహనాన్ని వెంబడించారు. ఖాజీపేట మండలం పాటిమీదపల్లె వద్ద ఉన్న టోల్ ప్లాజా వద్దకు రాగానే వాహనం స్వాధీనం చేసుకున్నారు. వాహన డ్రైవర్ పుట్టాల ఓబులేసు, దేవగుడి రామాంజనేయులును అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని ఖాజీపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ పరిశీలించగా 1,417 కేజీలు బరువు గల 233 బస్తాలు ఉన్నట్లు గుర్తించారు. ఈమేరకు కేసు నమోదు చేశారు.
ద్విచక్ర వాహనం ఢీకొని..
ఖాజీపేట : రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీ కొని పుల్లూరు బాలస్వామి (47) అనే వ్యక్తి మృతి చెందాడు. పుల్లూరు బంగ్లా వద్ద ఉన్న బాల స్వామి పని నిమిత్తం రావులపల్లె చెరువు వద్ద దిగి రోడ్డు దాటుతుండగా కడప నుంచి వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీ కొంది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తి బంధువులు అక్కడికి చేరుకుని చికిత్స నిమిత్తం కడప రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖాజీపేట పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆటో బోల్తా పడి
8 మందికి గాయాలు
పులివెందుల రూరల్ : తొండూరు మండలం సైదాపురం గ్రామ సమీపంలోని గోడౌన్ వద్ద ముద్దనూరు రోడ్డు వైపు వెళ్తున్న ఆటో టైర్ పగిలి బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 8 మందికి గాయాలయ్యాయి. ఆటోలో ఉన్న నందిని, కళావతి, శివాని, సుహాసిని, శివజ్యోతి, ప్యారి, సరస్వతితో పాటు ఆటో డ్రైవర్కు గాయాలయ్యాయి. చికిత్స కోసం వారిని 108 వాహనంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కడపకు సిఫార్సు చేశారు.

లారీ, చౌక బియ్యం స్వాధీనం