
వైఎస్సార్సీపీ పోరుబాట
సాక్షి ప్రతినిధి, కడప : మారిన మనిషిగా అనుచరగణం కీర్తించారు, పథకాల పేర్లతో జనాన్ని నమ్మించారు. అధికారం కోసం అబద్ధాల హామీల ముసుగు వేసుకున్నారు. ఎన్నికల్లో నెగ్గారు, ఆపై నిజస్వరూపం బహిర్గతమైంది. ఏడాది కాలంలో హామీలు తుంగలో తొక్కేశారు. ప్రకృతి సంపద ఆధారంగా తెలుగు తమ్ముళ్లు దోపిడీ యథేచ్ఛగా తెరపైకి వచ్చింది. పౌరులకు రాజ్యంగం కల్పించిన హక్కులకు తిలోదాకాలు ఇచ్చారు. ‘నాడు–నేడు’ వెలుగు కరిగిపోయి, విద్యా వ్యవస్థకు చంద్రగ్రహణం ఆవహించింది. తల్లికి వందనం ఊరిస్తోంది. ఆడబిడ్డ నిధి మాటే లేదు. నిరుద్యోగ భృతి అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు ఉండిపోయింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊసేలేదు. ‘బాబు ష్యూరిటీ... భవిష్యత్కు గ్యారెంటీ’తో జనం మధ్యకు వచ్చారు. సీఎం చంద్రబాబు మాటల గారడీని నమ్మి మోసపోయామని ఆవేదన చెందడం ప్రజల వంతైంది. ఏడాది పాలనలో అవినీతి, మోసం, నయవంచన, కుట్ర, పగ, వెన్నుపోటు రాజ్యమేలుతున్నాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
ఊరువాడ ప్రచారం
‘ప్రతి ఇంటికీ ఉద్యోగం.. లేదంటే నిరుద్యోగ భృతి రూ.3 వేలు తప్పకుండా ఇస్తాం’ ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ద్వారా ప్రతి నిరుద్యోగికి భృతి చెల్లిస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు ఊదరగొట్టారు. ‘అమ్మ ఒడి’ పథకంలో సమూల మార్పులు తీసుకువస్తాం. ఎంత మంది విద్యార్థులంటే అందరికీ ‘తల్లికి వందనం’ పథకం ద్వారా రూ.15 వేలు చొప్పున చెల్లిస్తాం. ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు చెల్లిస్తాం’ అని ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ‘రైతులను ఆదుకుంటాం. పంటల సాగుకు అవసరమైన పెట్టుబడికి ‘అన్నదాత సుఖీభవ పథకం’ ద్వారా రైతులకు రూ. 20 వేలు ఇవ్వనున్నట్లు’ హామీ ఇచ్చారు. 18 సంవత్సరాలు నిండిన యువతి నుంచి 59 సంవత్సరాల వరకూ ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ‘ఆడబిడ్డ నిధి’ చెల్లిస్తామని ఊరువాడా చెప్పుకొచ్చారు. మహిళలు ఎక్కడికెళ్లినా సరే ఉచితంగా ప్రయాణ సదుపాయం కల్పిస్తాం. ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అంటూ ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చి ఏడాదైంది. ఇప్పటికీ చెప్పిన మాట చెప్పినట్లుగా, ఇచ్చిన హామీలు ఇచ్చినట్లుగా అమలు చేయలేదు. ప్రజలను వంచించి ‘వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్’గా సీఎం చంద్రబాబు కీర్తి గడిస్తున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
ఆశపడి ఆపై మోసపోయి..
సామాన్యులకు కామధేనువుగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిలిచింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో నిమిత్తం లేదు. చెప్పిన మాట చెప్పినట్లుగా అమలు చేయడమే లక్ష్యంగా ఐదేళ్లు నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ కొనసాగించింది. కేలండర్ విడుదల చేసి ఏ పథకం ఎప్పుడు అమలు చేస్తామనే విషయాన్ని తేదీలతో సహా బహిర్గతం చేసి సరిగ్గా ఆ తేదీకి అమలు చేసిన చరిత్ర ఆయన సొంతమైంది. జిల్లాలో డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారులు 9,82,554 మంది బ్యాంకు ఖాతాలకు రూ.8,857.42 కోట్లు వేశారు. నాన్ డీబీటీ ద్వారా మరో 9,72,388 మందికి రూ.3,279.10 కోట్లు చెల్లించారు. మొత్తంగా రూ.12,136.52 కోట్లు వివిధ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన వారికి అందించి చరిత్ర సృష్టించారు. సామాన్యుల జేబులు డబ్బులతో గలగలు ఉండేవి. అంతకంటే ఎక్కువగా అందిస్తామని సూపర్ సిక్స్ పేరుతో పథకాలు ప్రవేశ పెట్టడంతో ఆశపడి టీడీపీ మాటలకు మోసపోయారు. ఏడాదైనా ఒక్క రూపాయి ప్రజలకు నేరుగా అందిన దాఖలాలు లేవు. కామధేనువులాంటి వైఎస్ జగన్ సర్కార్ను పోగొట్టుకొని, దున్నపోతు లాంటి చంద్రబాబు సర్కార్ తెచ్చుకున్నామని ప్రజలు ఆవేదన పడుతున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.
ప్రజలకు చంద్రబాబు
మరోసారి మోసం
ఊరిస్తున్న తల్లికి వందనం పథకం
అందని ద్రాక్షలా నిరుద్యోగ భృతి
18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు
రూ.15 వందలు ఉత్తిదే
రైతుకు పెట్టుబడి సాయం
రూ.20 వేల ఊసేలేదు
సీ్త్రలకు ఉచిత బస్సు ప్రయాణం
మాటే మర్చారు
‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్ గ్యారెంటీ’ పేరుతో ఊదరగొట్టిన టీడీపీ నేతలు
ఏడాదైనా అమలు కాని
‘సూపర్ సిక్స్’ పథకాలు
నేడు వెన్నుపోటు దినంపై
ఆందోళనలు
సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై వైఎస్సార్సీపీ మొదటి నుంచి గర్జిస్తోంది. జూన్ 4న, బుధవారం ‘వెన్నుపోటు దినం’ పాటిస్తోంది. నియోజకవర్గ కేంద్రాల్లో నిరశన పాటించేందుకు సన్నాహాలు పూర్తి అయ్యాయి. ఇప్పటికే మరోమారు చంద్రబాబు హామీలతో మోసపోయామని ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలపై భారీ స్థాయిలో ప్రజలు పాల్గొనే అవకాశం ఉందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అన్నీ ప్రాంతాలల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టేందుకు ఆ పార్టీ సర్వసన్నద్ధమైంది.

వైఎస్సార్సీపీ పోరుబాట

వైఎస్సార్సీపీ పోరుబాట