జెడ్పీలో కారుణ్య నియామకాలు | - | Sakshi
Sakshi News home page

జెడ్పీలో కారుణ్య నియామకాలు

May 8 2025 12:23 AM | Updated on May 8 2025 12:23 AM

జెడ్పీలో కారుణ్య నియామకాలు

జెడ్పీలో కారుణ్య నియామకాలు

కడప సెవెన్‌రోడ్స్‌: జిల్లా ప్రజా పరిషత్‌ యాజమాన్య పరిధిలో పనిచేస్తూ మరణించిన తొమ్మిది మంది ఉద్యోగుల కుటుంబ సభ్యులకు జెడ్పీ చైర్మన్‌ రామగోవిందరెడ్డి బుధవారం కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. వెంకట సురేష్‌ యాదవ్‌, కేశవకుమార్‌, షైఫ్‌ నఫీజ్‌, ఎన్‌జీవీ లక్ష్మి, హరిప్రసాద్‌, లావణ్య, సింధు, అరవింద వరప్రపసాద్‌, నవీన్‌కుమార్‌లను ఆఫీసు సబార్డినేట్లు నియామకపత్రాలు అందజేశారు. కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ మినిస్ట్రియల్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లంకా మల్లేశ్వరరెడ్డి శ్రీనివాసులురెడ్డి జెడ్పీ చైర్మన్‌, సీఈఓలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ పరిపాలన అధికారి భాస్కర్‌రెడ్డి, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ బాలయ్య, జెడ్పీటీసీ బయపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement