రోడ్డు ప్రమాదంలో కాంట్రాక్టర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో కాంట్రాక్టర్‌ మృతి

May 27 2025 12:26 AM | Updated on May 27 2025 12:26 AM

రోడ్డ

రోడ్డు ప్రమాదంలో కాంట్రాక్టర్‌ మృతి

పోరుమామిళ్ల : పోరుమామిళ్ల – బద్వేలు రోడ్డులో చెన్నారెడ్డిపేట సమీపంలో సోమవారం ఉదయం మోటార్‌బైక్‌లో వెళుతున్న పెద్దిరెడ్డి వెంకటరెడ్డి (56)ని బొలెరో వాహనం ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మండలంలోని కొండుగారిపల్లెకు చెందిన వెంకటరెడ్డి చిన్న చిన్న కాంట్రాక్టు పనులు చేసేవారు. ఉదయం పని వద్దకు వెళ్లేందుకు బైక్‌లో వెళుతుండగా 4 వే లైన్స్‌ రోడ్డు పనికి చెందిన బొలెరో వాహనం అతివేగంగా వెనుక నుంచి ఢీ కొట్టి 50 మీటర్లు వెంకటరెడ్డిని బైక్‌తో సహా లాక్కొని వెళ్లింది. వెంకటరెడ్డి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రామగోవిందరెడ్డికి సమీప బంధువు కావడంతో పాటు వెంకటరెడ్డికి పెద్ద బంధువర్గం ఉంది. వెంకటరెడ్డి ప్రమాదంలో మృతి చెందిన వార్త తెలియడంతో పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు పెద్ద సంఖ్యలో జనం చేరుకున్నారు. ఆయన మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది.

దుంపలగట్టు చెరువు మట్టి తరలింపుతో సంబంధం లేదు

ఖాజీపేట : చెరువు మట్టితో టీడీపీ నేత వ్యాపారం అంటూ తనపై బురద చల్లే విధంగా వార్త రాశారని దానితో తనకు ఎలాంటి సంబంధం లేదని కేసీ కెనాల్‌ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్‌ రెడ్యం రవీంద్రారెడ్డి తెలిపారు. సాక్షి దినపత్రికలో సోమవారం ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. ఖాజీపేటలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దుంపలగట్టు చెరువులో మట్టిని జాతీయ రహదారి అవసరాల కోసం అధికారులు తరలించారన్నారు. అయితే అది తాను తరలిస్తున్నట్లు రాయడం తగదన్నారు. ఈ విషయంలో తన ప్రమేయం ఉన్నట్లు ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నానని తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో  కాంట్రాక్టర్‌ మృతి1
1/2

రోడ్డు ప్రమాదంలో కాంట్రాక్టర్‌ మృతి

రోడ్డు ప్రమాదంలో  కాంట్రాక్టర్‌ మృతి2
2/2

రోడ్డు ప్రమాదంలో కాంట్రాక్టర్‌ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement