
● తోడు–నీడగా వైఎస్సార్సీపీ
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో ఉద్యాన పంటలను నమ్ముకున్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లా వ్యాప్తంగా 42,625 హెక్టార్లులో వివిధ ఉద్యాన పంటలు సాగులో ఉన్నాయి. అందులో ప్రధానంగా అరటి సాగు 9,779 హెక్టార్లలో ఉంది. 25,479 హెకార్లలో చీనితోటలు, 4,010 హెక్టార్లులో మామిడి సాగులో ఉంది. ఓవైపు ప్రకృతి మరోవైపు మార్కెట్ ఉద్యాన పంటలపై పగబట్టింది. ప్రకృతి కారణంగా అర్ధాంతరంగా దిగుబడులు కోల్పోవాల్సి వస్తోంది. ఆపై దిగుబడి లభించినా గతంతో పోల్చుకుంటే గణనీయంగా ధరలు పడిపోయాయి. అరటి టన్ను సరాసరిగా రూ.7వేలు పలుకుతుంటే, చీని టన్ను ఇప్పుడిప్పుడు రూ.20వేల వరకూ లభిస్తోంది. అదే చీని గతంలో టన్ను రూ.70వేలు పలికిన కాలం లేకపోలేదు. అరటి కూడా టన్ను రూ.25వేలు తగ్గకుండా ఉండేది. ఆ పరిస్థితి నుంచి దయనీయస్థితిలోకి రావాల్సి వచ్చిందని పలువురు వాపోతున్నారు.
పగబట్టిన ప్రకృతి...
అసలే రోజు రోజుకీ పడిపోతున్న ధరలు, దీనికి తోడు అకస్మాత్తుగా రెండు సార్లు ఈదురుగాలులతో కూడిన వర్షం. దీంతో జిల్లా వ్యాప్తంగా అరటి దెబ్బతింది. రైతులు ఒక్కసారిగా కుదేలయ్యారు. అటు ధరలేక, ఇటు పంట చేతికి అందక ఎటు పాలుపోని స్థితిలో రైతులున్నారు. మరోవైపు భరోసా ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన రైతులను గాలికొదిలేసింది. భారీగా నష్టపోయిన రైతులకు వెంటనే ఇన్ఫుట్ సబ్సిడీ ఇచ్చి కాస్తోకూస్తో తోడుగా ఉండాలని గానీ... రైతులను ఆదుకోవాలనే ఆలోచన గానీ ప్రభుత్వ పెద్దల్లో కన్పించడం లేదని రైతులు వాపోతున్నారు.
ఈయన పేరు రామాంజనేయరెడ్డి. లింగాల మండలం పెద్దకూడాల గ్రామం. చీనిచెట్లకు తెగుళ్లు సోకడంతో వాటిని తొలగించి 4.50 ఎకరాలల్లో అరటి సాగు చేశారు. ఆ పొలంలో 5500 మొక్కలు యాలక్కి రకం అరటి సాగు చేశారు. సుమారు రూ.7లక్షలు పెట్టుబడులు పెట్టారు. మార్చి 22న వీచిన ఈదురుగాలులకు అరటి పంట నేలమట్టమైంది. మరోవైపు అరటి ధరల్లేక పెట్టుబడి కూడా దక్కలేదు. ఇప్పుడారైతు ఆవేదన వర్ణనాతీతం. జిల్లాలోని ఉద్యాన రైతుల దుస్థితి ఇది.
కోల్డ్ స్టోరేజీకి మోకాలడ్డు
వైఎస్సార్సీపీ ప్రభుత్వం పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె గ్రామ సమీపంలో కోల్డ్ స్టోరేజ్ నిర్మించింది. కోల్డ్ స్టోరేజ్ ప్రారంభించకుండా కూటమి సర్కార్ మోకాలడ్డుతోంది. కోల్డ్ స్టోరేజ్ రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఇప్పటికై నా తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
–భాస్కర్రెడ్డి,అరటి రైతు, నల్లపురెడ్డిపల్లె
భారీగా తగ్గిన అరటి ధరలు
వేసవి కావడంతో అరటి కాయల ధరలు పడిపోయాయి. దీనికి తోడు ఒకపక్క ఈదురు గాలుల వానలకు అరటి పంటలు పూర్తిగా దెబ్బతీశాయి. ప్రభుత్వం నష్టపోయిన అరటి రైతులకు పరిహారం అందించాలి.
–ఆంజనేయులు,అరటి రైతు, నల్లపురెడ్డిపల్లె
జిల్లాలో 42వేల హెక్టార్లలో ఉద్యాన పంటల సాగు
పెట్టుబడులకు తగ్గట్లు ధరలు లేకపోవడంతో భారీ నష్టాలు
నష్టాలు భరించలేక చీని తోటలను తొలగిస్తున్న రైతన్నలు
మరోవైపు వైఎస్సార్సీపీ రైతులకు అండగా నిలిచిందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు రూ.3వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి స్థాయిలో రైతులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. అలాగే పంటల నిల్వ కోసం కోల్డ్ స్టోరేజీ ప్రణాళికలు చేపట్టి పులివెందులలో రూ.26 కోట్లతో అరటి కోల్డ్ స్టోరేజీ నిర్మించారు. తాజా గా జిల్లాలో ఈదురుగాలులకు అరటి పంట కుప్పకూలిపోయింది. స్వయంగా పరిశీలించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల దీనస్థితికి చలించిపోయారు. వైఎస్సార్సీపీ తరుపున రైతులను ఆదుకుంటామని ప్రకటించారు. ఆ వెంటనే నష్టపోయిన రైతుల వివరాలు తెప్పించుకొని 1420 ఎకరాలల్లో 670 మంది రైతులకు హెక్టార్కు రూ.20వేలు చొప్పున రూ.1.14కోట్లు వైఎస్సార్సీపీ తరపున ఆర్థిక సహాయం ప్రకటించారు. రైతు బిడ్డగా రైతు కష్టాలు తెలిసిన వ్యక్తిగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు చేయూతనిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు పంట నష్టం అంచనాలు వెళ్లాయే కానీ, పరిహారంగా ఇన్ఫుట్ సబ్సిడీ చెల్లించాలనే ఆలోచన, చలనం లేదని, ఆ దిశగా ప్రయత్నాలు చేసే ప్రజాప్రతినిధి కూడా జిల్లాలో అధికార పక్షంలో కరువయ్యారని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.
చీని చెట్లు తొలగిస్తున్నాం
కన్నబిడ్డల్లా చూసుకున్న చీని చెట్లను తొలగించుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఓ వైపు తెగుళ్లు మరోవైపు ధరల పతనం ఈ రెండు కారణాలతో ఏళ్లు తరబడి పెంచుకున్న చెట్లును తొలగిస్తున్నాం. జేసీబీలతో చీని చెట్లు తొలగిస్తున్న పరిస్థితులను దాపురించడం చాలా బాధాకరం. –చెన్నకేశవరెడ్డి, రైతు, సింహాద్రిపురం

● తోడు–నీడగా వైఎస్సార్సీపీ

● తోడు–నీడగా వైఎస్సార్సీపీ

● తోడు–నీడగా వైఎస్సార్సీపీ

● తోడు–నీడగా వైఎస్సార్సీపీ

● తోడు–నీడగా వైఎస్సార్సీపీ

● తోడు–నీడగా వైఎస్సార్సీపీ