
మే 4న లాంగ్మార్చ్
కడప కార్పొరేషన్: వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మే 4వ తేది ఆదివారం జరిగే లాంగ్ మార్చ్ను విజయవంతం చేయాలని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా పిలుపునిచ్చారు. మంగళవారం కడప నగరంలోని అంజద్బాషా కార్యాలయంలో పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత జమ్ము కశ్మీర్ రాష్ట్రంలోని పెహల్గాంలో జరిగి న ఉగ్రదాడిలో మరణించిన వారికి స్మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, ముంతాజ్బేగం, వైఎస్సార్ సీపీ నాయకుడు జమాల్వలీ, పెద్దిరెడ్డి రామ్మోహన్రెడ్డి, అల్లాబక్ష్, అల్తాఫ్, బీహెచ్ ఇలియాస్, త్యాగరాజు, వినోద్, జమీల్, బాబు, కార్పొరేటర్లు పాకా సురేష్, షఫీ, బసవరాజు, బాలస్వామిరెడ్డి, షంషీర్, చాక్లెట్ గౌస్, మల్లికార్జున, కోఆప్షన్ సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు ఉన్నారు.