వ్యక్తిపై కత్తితో దాడి | - | Sakshi
Sakshi News home page

వ్యక్తిపై కత్తితో దాడి

Apr 25 2025 8:30 AM | Updated on Apr 25 2025 8:30 AM

వ్యక్

వ్యక్తిపై కత్తితో దాడి

బద్వేలు అర్బన్‌ : స్థానిక నెల్లూరు రోడ్డులోని భారత్‌ పెట్రోలు బంకు సమీపంలో బుధవారం అర్ధరాత్రి బాకీ విషయమై ఓ వ్యక్తి మరో వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని కోటిరెడ్డినగర్‌కు చెందిన రమణయ్య లారీడ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. కడపకు చెందిన లారీ ఓనర్‌ దస్తగిరి అనే వ్యక్తి వద్ద రమణయ్య డ్రైవర్‌గా వస్తానని నమ్మబలికించి కొంత నగదును అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. అయితే లారీకి డ్రైవర్‌గా వెళ్లకుండా.. డబ్బులు తిరిగి చెల్లించకుండా కాలయాపన చేస్తుండటంతో బుధవారం దస్తగిరి బద్వేలుకు వచ్చి రమణయ్యను నిలదీశాడు. ఈ సమయంలో ఇరువురి మధ్య మాటమాట పెరిగి ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో దస్తగిరి తన వద్ద ఉన్న కత్తితో రమణయ్యను కడుపు భాగంలో, వీపు భాగంలో పొడిచాడు. ఇంతలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని రక్తగాయాలైన రమణయ్యను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అర్బన్‌ ఎస్‌ఐ సత్యనారాయణ కేసు నమోదు చేశారు. దస్తగిరిని అదుపులోకి తీసుకున్నారు.

వాహనాలు స్వాధీనం

కడప అర్బన్‌ : జిల్లా వ్యాప్తంగా రికార్డులు లేని 51 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధ, గురువారాల్లో మొత్తం 108 ద్విచ క్ర వాహనాలు, 6 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. వివిధ పోలీస్‌స్టేషన్‌ల పరిధిల్లో రౌడీ షీటర్లు, ట్రబుల్‌ మాంగర్లకు పోలీసులు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. అ నుమానితులు, పాత నేరస్తుల ఇళ్లలో తనిఖీలు చేశా రు. సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించా రు. కడప టూ టౌన్‌ పి.ఎస్‌ పరిధిలోని బిస్మిల్లా నగర్‌ లో నిర్వహించిన కార్డన్‌ అండ్‌ సర్చ్‌ లో 4 ద్విచక్ర వా హనాలను స్వాధీనం చేసుకున్నారు. కడప టూ టౌన్‌ సి.ఐ బి.నాగార్జున, ఎస్‌.ఐలు హుస్సేన్‌, సిద్దయ్య, చిన్నచౌక్‌ ఎస్‌.ఐ రాజరాజేశ్వర రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

బస్సులో వెళుతూ

వడదెబ్బతో మహిళ మృతి

సింహాద్రిపురం : మండలంలోని బలపనూరు గ్రామంలో గురువారం బస్సులో ప్రయాణిస్తున్న మహిళ వడదెబ్బకు గురై మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మృతురాలి అల్లుడు శివ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తాడిపత్రి నుంచి పులివెందులకు వస్తున్న ఆర్టీసీ బస్సులో యనమల భవాని(50) తన మనవరాలితో బయలుదేరింది. మధ్యాహ్నం సమయంలో బస్సులో మనుమరాలు ఏడుస్తున్నా భవాని నుంచి ఉలుకు పలుకు లేకపోవడంతో తోటి ప్రయాణీకులు ఆమెను లేపడంతో భవాని అక్కడే కుప్పకూలారు. దీంతో తోటి ప్రయాణీకులు ఆమెను 108 వాహనంలో పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే వడదెబ్బకు గురై మృతి చెందినట్లు నిర్ధారించారు.

వ్యక్తిపై కత్తితో దాడి 1
1/2

వ్యక్తిపై కత్తితో దాడి

వ్యక్తిపై కత్తితో దాడి 2
2/2

వ్యక్తిపై కత్తితో దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement