
పద్మశాలీయ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
ప్రొద్దుటూరు కల్చరల్ : పదో తరగతి, ఇంటర్లో ప్రతిభ కనబరిచిన పద్మశాలీయ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించనున్నట్లు పద్మశాలీయ అభ్యుదయ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నా చంద్రబాబు తెలిపారు. స్థానిక ప్రెస్క్లబ్లో మంగళవారం పద్మశాలీయ ప్రతిభా పురస్కారాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పదో తరగతిలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రథమ బహుమతి రూ.4వేలు, ద్వితీయ బహుమతి రూ.3వేలు అందిస్తామన్నారు. స్థానికంగా ఇంటర్ చదివి ప్రతి గ్రూపులో 900 మార్కులకుపైగా సాధించిన విద్యార్థులకు ప్రథమ బహుమతి రూ.5వేలు, ద్వితీయ బహుమతి రూ.4వేలు అందిస్తామని చెప్పారు. టెన్త్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 450కిపైగా మార్కులు సాధించిన విద్యార్థులకు కన్సొలేషన్ బహుమతి రూ.3వేలు, ఎంసెట్, నీట్, మెడిసిన్, ఇంజనీరింగ్, ఐఐటీ, జేఈఈ మెయిన్స్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు రూ.5వేలు నగదు బహుమతి, మెమెంటో, ప్రశంసా పత్రాలు అందిస్తామన్నారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించి టౌన్ ఫస్ట్గా నిలిచిన పద్మశాలీయేతర విద్యార్థులకు రూ.4వేలు నగదు బహుమతి అందిస్తామన్నారు. అర్హులైన విద్యార్థులు మే 17వ తేదీలోపు తమ దరఖాస్తులను పద్మశాలీయ కల్యాణ మండపంలో అందించాలని కోరారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మే 27న ప్రముఖుల చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాలను అందిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 9032705866, 9290571411 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. సమావేశంలో పద్మశాలీయ అభ్యుదయ సంఘం ప్రధాన కార్యదర్శి వద్ది నాగరాజు, ఉపాధ్యక్షుడు మునిస్వామి, కోశాధికారి శ్రీనివాసులు, ఆనంద్, సంజీవరాయుడు, జానకిరామయ్య పాల్గొన్నారు.